News April 24, 2025

అల్లూరి జిల్లాలో గంజాయి తగ్గుముఖం: కలెక్టర్

image

గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందని  కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అల్లూరి జిల్లాలో గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు. కలెక్టరేట్‌లో గంజాయి సాగు నిర్మూలన, ప్రత్యామ్నాయ పంటలపై అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. గంజాయి నిర్మూలన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో గంజాయి వినియోగంపై కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

Similar News

News April 25, 2025

కామారెడ్డి: మహిళను కాపాడిన కానిస్టేబుల్

image

కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ కానిస్టేబుల్ దేవా కుమార్‌ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించి ఓ మహిళను చాకచక్యంగా రక్షించినందుకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.హనుమంతరావు ప్రశంసించి శాలువాతో సత్కరించారు. సమయస్ఫూర్తితో 100కి సమాచారం ఇచ్చి ఆమెను కాపాడిన దేవా కుమార్‌కు అభినందనలు తెలిపారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. విధి నిర్వహణతో పాటు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని కొనియాడారు.

News April 25, 2025

మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డి అరెస్ట్ 

image

సంచలనం రేకెత్తించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో స్థానిక రెడ్డీస్ కాలనీకి చెందిన వైసీపీ నేత, రైస్ మిల్ మాధవరెడ్డిని గురువారం రాత్రి తిరుపతి CID పోలీసులు అరెస్టు చేశారు. CID DSP కొండయ్య నాయుడు కథనం ప్రకారం.. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ అరెస్టు కాగా.. గురువారం మాధవరెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.

News April 25, 2025

ఈ వారంలోనే TG టెన్త్ ఫలితాలు!

image

TG: టెన్త్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. నాలుగైదు రోజుల్లోనే రిజల్ట్స్‌ను విద్యాశాఖ ప్రకటించనున్నట్లు సమాచారం. విడుదల తేదీని ఖరారు చేయాలని కోరుతూ పరీక్షల విభాగం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. CM రేవంత్ ఆమోదం లభించగానే ఫలితాలను రిలీజ్ చేస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన పబ్లిక్ పరీక్షలకు 5 లక్షల మందికి పైగా హాజరయ్యారు.

error: Content is protected !!