News March 9, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>10న రంపచోడవరంలో గ్రీవెన్స్ డే>పాడేరులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభం>చింతపల్లి: ఉదయం చలి..మధ్యాహ్నం ఎండ>అల్లూరి: తేనె సేకరణ ధర పెంపు>పాడేరులో ఘనంగా మహిళా దినోత్సవం>చింతూరు: ఏజెన్సీ సమస్యలపై 26న ధర్నా>పాడేరు: జిల్లాలో మరో 10వేల ఎకరాల్లో కాఫీ తోటలు>అరకు: మహిళా దినోత్సవ ర్యాలీలో సినీ నటులు>రంపచోడవరంలో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Similar News

News December 5, 2025

చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

image

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్‌కుమార్, రాజ్‌బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్‌కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News December 5, 2025

HNK కలెక్టరేట్లో ఆవిష్కరణకు సిద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం

image

రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి. ఈ విగ్రహాలను డిసెంబర్ 9న లాంఛనంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హన్మకొండ కలెక్టరేట్‌లో స్థాపించిన విగ్రహాన్ని కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణ తల్లి దినోత్సవాన్ని పాటిస్తూ, సోనియా గాంధీ పుట్టినరోజున ఈ ఆవిష్కరణ జరగనుంది.

News December 5, 2025

నర్సంపేట: సీఎంకు సమస్యల స్వాగతం

image

నర్సంపేటలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం నేడు CM రేవంత్ వచ్చే నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పట్టణ ప్రజల్లో కూడా ఉత్సాహం నెలకొంది. అయితే, సీఎం పర్యటన సమయానికే నర్సంపేటలోని పలు సమస్యలు స్వాగతం చెప్పేలా కనిపిస్తున్నాయి. పట్టణంలోని కొన్ని వార్డుల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిని ఉండగా, మిషన్ భగీరథ పైప్‌లైన్లలో చోటుచేసుకున్న వాటర్ లీకేజీలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.