News March 9, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>10న రంపచోడవరంలో గ్రీవెన్స్ డే>పాడేరులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభం>చింతపల్లి: ఉదయం చలి..మధ్యాహ్నం ఎండ>అల్లూరి: తేనె సేకరణ ధర పెంపు>పాడేరులో ఘనంగా మహిళా దినోత్సవం>చింతూరు: ఏజెన్సీ సమస్యలపై 26న ధర్నా>పాడేరు: జిల్లాలో మరో 10వేల ఎకరాల్లో కాఫీ తోటలు>అరకు: మహిళా దినోత్సవ ర్యాలీలో సినీ నటులు>రంపచోడవరంలో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
Similar News
News September 15, 2025
అనంత: పోలీస్ గ్రీవెన్స్కు 121 అర్జీల రాక

అనంతపురం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)కు అనూహ్య స్పందన లభించినట్లు SP జగదీశ్ పేర్కొన్నారు. మొత్తం 121 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, రస్తా తగాదాలపై వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని SP హామీ ఇచ్చారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ డేకు 334 అర్జీలు వచ్చాయని జేసీ శివ్ నారాయణ శర్మ తెలిపారు.
News September 15, 2025
విశాఖ పీజీఆర్ఎస్కు 329 వినతులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని రెవెన్యూ అధికారి భవానీ శంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఆయన ప్రజలు వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 329 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 92, జీవీఎంసీకి చెందినవి 88, పోలీసు శాఖకు సంబంధించి 25, ఇతర శాఖలకు సంబంధించి 124 ఉన్నాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేషశైలజ ఉన్నారు.
News September 15, 2025
బెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ కమిటీలో జహీరాబాద్ ఎంపీ కుమార్తె

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మీడియా, పబ్లిసిటీ ఛైర్మన్ పవన్ ఖేరా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అదనపు సమన్వయకర్తలను నియమించారు. బెంగాల్ ఎన్నికల కోసం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కుమార్తె గిరిజా షెట్కార్(పరిశోధన)ను పశ్చిమ బెంగాల్ మీడియా కోఆర్డినేటర్ కేటాయించారు.