News March 11, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>మార్చి 15న పాడేరులో మెగా జాబ్ మేళా
>వైద్యశాఖలో పోస్టుల భర్తీకి ధరఖాస్తుల ఆహ్వానం
> నేటి ఇంటర్ పరీక్షలకు 654 మంది దూరం
>రంపచోడవరానికి చెందిన ముగ్గురి అరెస్టు
>రాజవొమ్మంగిలో గిరిజన రైతులకు ఉచితంగా ఎరువులు
>ఏజెన్సీలో గిరిజనేతరులకు గృహాలు మంజూరు చేయాలి..శిరీషదేవి
> డబ్బు తీయాలన్నా..డోలీ ఎక్కాల్సిందే!
>పాడేరులో 7 అంబులెన్సులు ప్రారంభం
Similar News
News February 12, 2026
కృష్ణా-వికారాబాద్ రైలు మార్గం.. కేంద్రానికి CM విజ్ఞప్తి

కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. గురువారం ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్తో పార్లమెంట్లోని ఛాంబర్లో భేటీ అయి దీనిపై చర్చించారు.
News February 12, 2026
‘వందేమాతరం’ ఆలాపన ఉత్తర్వులపై ముస్లిం బోర్డు అభ్యంతరం

అన్ని స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ పాటలో దుర్గా, ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలున్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లింల నమ్మకాలకు ఇది విరుద్ధం’ అని పేర్కొంది.
News February 12, 2026
సంక్షోభంలో సింగరేణి.. కొత్త CMD గట్టెక్కించేనా?

సింగరేణి నూతన సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా నైనీ బొగ్గు బ్లాకుల టెండర్లు, నిధుల మళ్లింపు ఆరోపణలతో రేగిన రాజకీయ దుమారం, కేంద్ర విచారణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమర్థుడైన అధికారికి పగ్గాలు అప్పగించేలా భారీ కసరత్తు చేశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడంలో కొత్త బాస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కార్మికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


