News March 24, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>పార్లమెంటు హౌస్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం
>కొయ్యూరులో డైరెక్టర్ కృష్ణవంశీ సందడి
>అల్లూరి: 10th మ్యాథ్స్ పరీక్షకు 104మంది గైర్హాజరు
>మారేడుమిల్లి: బాణంతో గిరిజనుడి హత్య
>అల్లూరి జిల్లాలో పలు చోట్లు వర్షం
>రాజవొమ్మంగి: అంధకారంలో 80 గ్రామాలు

Similar News

News October 23, 2025

భద్రాద్రి: అన్ని రుణాలను వసూలు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ఏపీఎం, సీసీలతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం కలెక్టరేట్‌లో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నాన్-పెర్ఫార్మెన్స్ రుణాలు, లైవ్‌హుడ్ యూనిట్ల ఏర్పాటు, చేపల, కౌజుపిట్టలు, మేకలు, నాటుకోళ్ల పెంపకం, మహిళా సమాఖ్య గ్రూపుల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. జిల్లాలో రుణ బకాయిలను ప్రణాళికాబద్ధంగా వసూలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

News October 23, 2025

వలసబాట పట్టిన కూలీలు

image

గ్రామాల్లో ఉపాధి కరువై పొట్ట కూటి కోసం కూలీలు వలసబాట పట్టారు. బుధవారం పెద్దకడబూరు ఎస్సీ కాలనీకి చెందిన పలువురు కూలీలు కర్ణాటకలోని రాయచూరు జిల్లా గబ్బూరు మండలం హనుమాపురంలో పత్తి తీయడానికి టెంపోలో బయలుదేరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామంలో సాగు చేసిన పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో పనులు కరువయ్యాయి. దీంతో చేసేది లేక పిల్లా పాపలతో కూలీలు వలస బాట పట్టారు.

News October 23, 2025

తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో

image

రాబోయే తుఫాన్ నేపథ్యంలో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఆర్డీవో సందీప్ బుధవారం సూచించారు. కర్నూలు రూరల్ మండలంలో 11, సి.బెళగల్ మండలంలో 9 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. వరద కారణంగా ఏవైనా ఇబ్బందులు కలిగితే ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ 08518-241380 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.