News March 24, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>పార్లమెంటు హౌస్లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం
>కొయ్యూరులో డైరెక్టర్ కృష్ణవంశీ సందడి
>అల్లూరి: 10th మ్యాథ్స్ పరీక్షకు 104మంది గైర్హాజరు
>మారేడుమిల్లి: బాణంతో గిరిజనుడి హత్య
>అల్లూరి జిల్లాలో పలు చోట్లు వర్షం
>రాజవొమ్మంగి: అంధకారంలో 80 గ్రామాలు
Similar News
News July 9, 2025
ఏలూరులో పురుగు మందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య

అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది వృద్ధురాలు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దెందులూరు మండలం మలకచర్లలో చేసుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సీతమ్మ (60) భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి జీవిస్తుంది. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతూ మంగళవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
News July 9, 2025
ఎన్టీఆర్ జిల్లాలో బంగారు కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే.?

ఎన్టీఆర్ జిల్లాలో P-4 పథకంలో లబ్ధి పొందనున్న బంగారు కుటుంబాల సంఖ్య 86 వేలకు చేరిందని కలెక్టర్ లక్ష్మీశా చెప్పారు. ఈ కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు 400 మందికిపైగా మార్గదర్శకులు ఉన్నారన్నారు. పేదరికం లేని సమాజం తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈ పథకంలో ఆయా కుటుంబాల సంక్షేమానికై మార్గదర్శకులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
News July 9, 2025
ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ సీజ్ చేసిన సిట్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్టాప్, ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు. డేటా విశ్లేషణ కోసం FSLకు పంపించారు. ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ను రికార్డును చేశారు. 2023 నవంబర్ 15-30 వరకు సర్వీస్ ప్రొవైడర్ డేటాలోని ఫోన్ నంబర్లు, డేటా రిట్రైవ్, హార్డ్ డిస్క్లోని రహస్యాలపై సిట్ ఆరా తీసింది. రేపు ప్రభాకర్ రావును సిట్ మరోసారి విచారించనుంది.