News March 26, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>అరకులో పాస్ పోర్టు సేవలు సులభతరం..ఎమ్మెల్యే
>అల్లూరి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం
>ముంచంగిపుట్టు: మార్చి 31లోగా ఈ-కేవైసీ చేయించుకోవాలి
>అల్లూరి జిల్లాలో పరీక్షలకు 101మంది దూరం
>రంప ఏరియా ఆసుపత్రిలో ఏప్రిల్ 1 నుంచి సదరం స్లాట్లు
>చింతూరు ఐటీడీఏను ముట్టడించిన నిర్వాసితులు
>రంప: 15,582మంది విద్యార్థులకు ప్లేట్స్
>పాడేరు: కలెక్టరేట్‌లో వైద్య శిబిరాల నిర్వహణ

Similar News

News February 22, 2026

NLG: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

image

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.

News February 22, 2026

ఎర్రగుంట్ల: రాత్రి రైలు ఎక్కి.. ఉదయానికి మిస్సింగ్

image

మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం ముక్కా ధనలక్ష్మి (25) అదృశ్యమైంది. ఈ మహిళ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గురువిమానిపల్లెకి చెందిన జగదీశ్వర్‌రెడ్డి భార్య. ఇరువురు విజయవాడలో శుక్రవారం రాత్రి రిజర్వేషన్ బోగీలో ఎక్కారు. తెల్లవారేసరికి తన భార్యలేదని భర్త ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 22, 2026

HYD: 80% సబ్సిడీతో ఈ-స్కూటర్లు

image

మైనారిటీ యువత ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ-స్కూటర్స్ పంపిణీ పథకం అమలు చేస్తున్నట్లు RR జిల్లా మైనారిటీ శాఖ అధికారి నవీన్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ- స్కూటర్ యూనిట్ వ్యయం సుమారు రూ.1.50 లక్షలు కాగా అందులో 80% సబ్సిడి (రూ.1.20 లక్షలు) ప్రభుత్వం అందిస్తుందని మిగిలిన 20%(రూ.30,000) లబ్ధిదారుడి వాటా కింద చెల్లించాలన్నారు.
# SHARE IT