News April 6, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>అల్లూరి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటన ఖరారు>అరకు: పవన్ కల్యాణ్ పర్యటను విజయవంతం చేయండి>అల్లూరి జిల్లాలో కోతులను బెదిరించే మైక్లు>అల్లూరి జిల్లాలో ఎటపాక ఫస్ట్..మారేడుమిల్లి లాస్ట్>అల్లూరి: గర్భిణిగా నాటకం ఆడిన మహిళ>రంప: చెరువులో జారిపడి వ్యక్తి మృతి>అరకు ఘాట్లో బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు.
Similar News
News April 8, 2025
పడుకునే ముందు వీటిని తింటున్నారా?

రాత్రి పడుకునే ముందు కొన్ని ఆహార పదార్థాలు తింటే నిద్రకు ఆటంకం కలుగుతుంది. నిద్ర, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వైట్ బ్రెడ్తో చేసే శాండ్ విచ్, పిజ్జా తింటే కడుపులో మంట పెరిగి నిద్రకు ఆటంకం కలుగుతుంది. బిర్యానీ, స్వీట్లు, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ద్రాక్ష, ఆరెంజ్, నిమ్మకాయలు తినకూడదు. కెఫిన్ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మేలు. రాత్రి ఆహారం 7 గంటలలోపు తినడం ఉత్తమం.
News April 8, 2025
NZB: పాప కనిపిస్తే సమాచారం ఇవ్వండి: SHO

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో తల్లి పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారి రమ్య కిడ్నాప్కు గురైన విషయం తెలిసిందే. సీసీ కెమెరాలో ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందలతో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ తెలిస్తే 8712659837 నంబర్కు సమాచారం ఇవ్వాలని వన్ టౌన్ SHO రఘుపతి సూచించారు.
News April 8, 2025
చైనాను హెచ్చరించిన ట్రంప్

చైనాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమపై విధించిన 34శాతం టారిఫ్ను వెనక్కి తీసుకోకపోతే డ్రాగన్ దేశంపై మరో 50శాతం సుంకం విధిస్తామని అల్టిమేటం జారీ చేశారు. రేపటికల్లా పన్నుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకపోతే ఏప్రిల్ 9నుంచి చైనా దిగుమతులపై అదనపు పన్ను ఉంటుందన్నారు. ట్రంప్ డ్రాగన్ వస్తువులపై 34శాతం టారిఫ్లు వేయగా, బీజింగ్ సైతం అంతే మెుత్తంలో US దిగుమతులపై సుంకాలు విధించింది.