News March 2, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> అల్లూరి జిల్లాలో ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
> పాడేరు: ప్రవేశ పరీక్షకు 3,939 మంది విద్యార్థులు హాజరు
> పాపికొండల అందాలు చూసిన పర్యాటకులు
> ఓపెన్ ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO
> బడ్జెట్‌తో ఆదివాసీలకు అన్యాయం
> సీలేరు నదిపై ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి
> పోలవరం నిర్వాసితుల బ్రతుకులతో ఆటలు వద్దు: CPM

Similar News

News November 25, 2025

పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

image

రిఫైన్డ్ ఫ్లోర్‌తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

News November 25, 2025

కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహలు కలకలం

image

కృష్ణానది సీతమ్మవారి పాదాల సమీపంలో మంగళవారం ఇద్దరి మృతదేహలు కలకలం సృష్టించాయి. సుమరు 40 సంవత్సరాల వ్యక్తి, 12 సంవత్సరాల బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నీళ్లలో నుంచి బయటికి తీసి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి పంపించామని పోలీసులు తెలిపారు. బ్యారేజ్ ర్యాంప్ సమీపంలో మృతదేహాలను గుర్తించామని, దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.

News November 25, 2025

FLASH: బోరబండలో నిప్పు అంటించుకున్న హిజ్రాల్లో ముగ్గురి మృతి

image

ట్రాన్స్‌జెండర్ మోనాలిసాకు వ్యతిరేకంగా ఇటీవల బోరబండ బస్టాండ్‌లో ఓ వర్గం చేపట్టిన ఆందోళన తీవ్ర విషాదంగా మారింది. ఆందోళన సమయంలో పెట్రోల్ పోసుకున్న ట్రాన్స్‌జెండర్లలో చికిత్స పొందుతూ మంగళవారం నవనీత (24) బాలానగర్‌లోని ఓ ఆస్పత్రిలో మరణించింది. ఈ నెల 20న అప్సానా, 23న హీనా కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. బోరబండ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.