News March 4, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

➤ అల్లూరి: వాట్సాప్ ద్వారా 10వ తరగతి హాల్ టిక్కెట్లు
➤ గంగవరం: అల్లూరి జిల్లాలో లక్ష్యానికి మించి పనిదినాలు
➤ ఢిల్లీ వెళ్లిన అల్లూరి జిల్లా కలెక్టర్
చింతపల్లి: సచివాలయంలో యువకుడు హల్చల్
➤ రంపచోడవరం పాఠశాలలపై మంత్రి కీలక ప్రకటన
➤హైవే అధికారులపై పాడేరు ఎమ్మెల్యే ఆగ్రహం
➤ పెదబయలు హౌసింగ్ ఏఈపై విచారణ జరిపించాలి: బీజేవైఎ
➤పాడేరు కలెక్టరేట్ను ముట్టడిస్తాం: ఆశాలు
Similar News
News July 8, 2025
పెద్దపల్లి: పీఎం కుసుమ్ పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష

పీఎం కుసుమ్ పథకం అమలుపై కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జులై నెలాఖరు వరకు PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఆసక్తి గల లబ్ధిదారుల ఎంపికతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం కోసం భూమి లెవెలింగ్ పనులను 9నెలల్లో పూర్తి చేయాలన్నారు. సబ్సిడీ ఉంటుందన్నారు.
News July 8, 2025
పవన్ కళ్యాణ్ ఆగ్రహం

AP: MLA ప్రశాంతి రెడ్డిపై మాజీ MLA నల్లపరెడ్డి చేసిన <<16985283>>వ్యాఖ్యలను <<>>Dy.cm పవన్ ఖండించారు. ‘మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం YCP నేతలకు అలవాటుగా మారింది. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాజం సిగ్గుపడుతుంది. ఆ మాటలు బాధించాయి. వ్యక్తిగత జీవితాలే లక్ష్యంగా చేసిన ఈ వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు ఖండించాలి. మహిళలను కించపరిచినా, అసభ్యంగా మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలుంటాయి’ అని హెచ్చరించారు.
News July 8, 2025
కోడూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కోడూరు మండలం చిట్వేలి ప్రధాన రహదారి గంధంవడ్లపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి వివరాల మేరకు.. కోనేటి పెంచలయ్య (45) కోడూరులో కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. సోమవారం రాత్రి మోటార్ బైక్పై చిట్వేలి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.