News February 26, 2025

అల్లూరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు(గురువారం) పాడేరు డివిజన్లో అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు కేటాయించిన భవనాలు ఉన్న సంస్థలకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలు పాటించాలని సూచించారు. 

Similar News

News February 27, 2025

అనకాపల్లి: ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలన్నారు. పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి ఉదయం ఏడు గంటలకి చేరుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్స్, కెమెరాలకు అనుమతి లేదన్నారు.

News February 27, 2025

వికారాబాద్ జిల్లా బుధవారం ముఖ్యంశాలు

image

✓ తాండూర్: భూకైలాస్ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి.✓ మర్పల్లి: డబ్బుల కోసమే వృద్ధురాలిని హత్య ముగ్గురు నిందితుల అరెస్ట్.✓ దామగుండం,బుగ్గ రామలింగేశ్వర స్వామి,పాంబండ రామలింగేశ్వర స్వామి,గాడిబాయి,భూకైలాస్ శివాలయాలకు పోటెత్తిన భక్తులు. ✓ వికారాబాద్ జిల్లాలో ఘనంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.✓ మహాశివుని ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఆశీస్సులతో

News February 27, 2025

తూ.గో: నేడే MLC ఎలక్షన్.. సర్వం సిద్ధం

image

ఉమ్మడి తూ.గో.జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసింది. దీంతో పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. గోదావరి జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 70 జోన్లలో 70 జోనల్ అధికారులు, 95మంది రూట్ ఆఫీసర్లను నియమించారు.

error: Content is protected !!