News March 24, 2025

అల్లూరి జిల్లాలో పిడుగుపాటుకు అవకాశం 

image

అల్లూరి జిల్లాలో పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెట్లు, పొలాల్లో, టవర్స్ కింద ఉండరాదని హెచ్చరించారు. పాడేరు, డుంబ్రిగుడ, హుకుంపేట, మాడుగుల, గంగవరం, గూడెం, అనంతగిరి, అరకు, చింతపల్లి మండలాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Similar News

News October 16, 2025

NLG: వేరుశనగ.. సాగు పెంపే లక్ష్యం..!

image

జిల్లాలో ఏటేటా తగ్గిపోతున్న వేరుశనగ పంటల సాగును పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో రెండు 2,22,444 హెక్టార్లలో పంట సాగు చేయించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. రైతులకు ఉచితంగా విత్తనాలు అందించనున్నారు. పంట నూనెల ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు.

News October 16, 2025

NLG: మాధవరెడ్డి హత్య.. జనస్రవంతిలోకి ఆశన్న

image

మావోయిస్టు పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. నిన్న ఆ పార్టీ కీలక నాయకుడు మల్లోజుల మహారాష్ట్ర CM ఎదుట 60 మందితో లొంగిపోయిన సంగతి తెలిసిందే. నేడు మరో కీలక నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అజ్ఞాతం వీడనున్నట్లు సమాచారం. ములుగు (D) చెందిన ఆశన్న IPS ఉమేష్ చంద్ర, ఎలిమినేటి మాధవరెడ్డిని హత్య చేసిన ఆపరేషన్‌కు నేతృత్వం వహించినట్లు చెబుతారు. అలిపిరి బ్లాస్ట్‌తో ఆశన్న పేరు విస్తృతమైంది.

News October 16, 2025

సిద్దిపేటలో హృదయ విదారక ఘటన

image

సిద్దిపేట జిల్లా పుల్లూరులో హృదయ విదారక ఘటన జరిగింది. ఆయనకు ముగ్గురు పిల్లలున్నా.. ఆయన మృతదేహాన్ని ఉంచేందుకు సొంతిళ్లు లేకపోయంది. పోచయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న పోచయ్య ఆరోగ్య క్షీణించి చనిపోయారు. పొలం విషయంలో గొడవలు జరుగుతుండగా అంత్యక్రియలకు కొడుకులు ముందుకు రాలేదు. దీంతో మృతదేహాన్ని రైతు వేదికలో ఉంచి గ్రామస్థుల సహకారంతో భార్యే అంత్యక్రియలు నిర్వహించింది.