News March 16, 2025

అల్లూరి జిల్లాలో ప్రతీ కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్: DEO

image

అల్లూరి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 71 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. జిల్లాలో పలు పరీక్ష కేంద్రాలో ఏర్పాట్లులను శనివారం ఆయన పరిశీలించి, టీచర్స్‌కు సూచనలు ఇచ్చారు. ప్రతీ కేంద్రంలో ఒక గెజిటెడ్ ఆఫీసర్, మరో సహాయ అధికారి సిట్టింగ్ స్క్వాడ్‌గా జిల్లా కలెక్టర్ నియమించారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 510మంది ఇన్విజిలేటర్లుని నియమించామన్నారు.

Similar News

News October 31, 2025

NABFINSలో ఉద్యోగాలు

image

నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీస్ (NABFINS) వివిధ రీజియన్లలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పని అనుభవం ఉన్నవారు, ఫ్రెషర్స్ కూడా దరఖాస్తుకు అర్హులే. టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. వెబ్‌సైట్: https://nabfins.org/

News October 31, 2025

జూబ్లీహిల్స్: నేటి నుంచి బీఆర్ఎస్ ‘మాట.. ముచ్చట’

image

జూబ్లీహిల్స్ ఎన్నికకు కేవలం 10 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ‘మాట.. ముచ్చట’ కార్యక్రమం జరుగనుంది. నియోజకవర్గంలో రద్దీ ప్రాంతాల్లో పార్టీ నాయకులు స్థానికులతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తారు. నగర అభివృద్ధిపై మాట్లాడనున్నారు.

News October 31, 2025

రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు

image

TGలోని SECBAD, కాచిగూడ, APలోని విజయవాడ, TPT, రాజమండ్రి, GNTతో పాటు దేశంలో 76 స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మహా కుంభమేళా వేళ ఢిల్లీ స్టేషన్‌లో తొక్కిసలాట అనంతరం రద్దీని నియంత్రించేందుకు అక్కడ ‘యాత్రి సువిధ కేంద్ర’ను అభివృద్ధి చేశారు. ఇందులో టికెట్ కౌంటర్‌తో పాటు ప్రయాణికులు వేచి ఉండేలా వసతులు కల్పించారు. ఇదే మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారు.