News March 13, 2025
‘అల్లూరి జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి’

అల్లూరి జిల్లాలో భూములకు సంబంధించి సరైన రికార్డులు లేవని రిజిస్ట్రేషన్ ప్రక్రియ లో మార్పులు అవసరమని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి అసెంబ్లీలో బుధవారం అన్నారు. చాలామందికి డి.నమూనా పట్టాలు ఉన్నాయని వీటి ద్వారానే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. వారసత్వం ప్రకారం భూమి విభజన చేసి పట్టాలు అందజేయాలని, చాలామందికి పట్టాలు లేకపోవడం వలన ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు, బ్యాంక్ రుణాలు పొందలేకపోతున్నారన్నారు.
Similar News
News December 4, 2025
హార్టికల్చర్ హబ్కి కేంద్రం ₹40వేల కోట్లు: CBN

AP: హార్టికల్చర్ హబ్గా 9 జిల్లాలను తయారుచేస్తున్నామని CM CBN తెలిపారు. దీనికోసం కేంద్రం పూర్వోదయ స్కీమ్ కింద ₹40వేల కోట్లు ఇస్తోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల్ని ఆకర్షించాలని చెప్పారు. అధికారులు టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలన్నారు. 7వ తరగతి నుంచే AI బేసిక్స్పై బోధన ఉండాలని సూచించారు. విశాఖ కాపులుప్పాడలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం 50 ఎకరాలు కేటాయించాలని చెప్పారు.
News December 4, 2025
కంట్రోల్ రూమ్లను వినియోగించుకోవాలి: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్లో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్&మానిటరింగ్ కమిటీ, సహాయ కేంద్రంను (కంట్రోల్ రూమ్) ఇప్పటికే ప్రారంభించామని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఏమైనా సమస్యలు ఉంటే, ఎన్నికలకు సంబంధించిన సమాచారం కొరకు టోల్ ఫ్రీ నంబర్ 96662 34383 నంబర్ను సంప్రదించాలన్నారు.
News December 4, 2025
బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: పీడీ

నెల్లూరును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ICDS పీడీ హేనా సుజన్ అన్నారు. గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, CDPOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.


