News March 12, 2025
అల్లూరి జిల్లాలో యువకుడిపై పోక్సో కేసు.!

అల్లూరి జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశామని సీఐ సన్యాసి నాయుడు బుధవారం తెలిపారు. బాలిక ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న యువకుడు మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి వేరే గ్రామానికి తీసుకుని వెళ్లాడని సీఐ తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 22, 2025
ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమేనా?

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే MLA దానం నాగేందర్ AICC పెద్దలతో సమావేశమయ్యారు. అనర్హత అనివార్యమైతే పదవి వదులుకోవాల్సిందే. రాజీనామా చేస్తే MLA టికెట్ తనకే ఇవ్వాలని ఆయన AICCని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశానని ఖైరతాబాద్ సీనియర్ లీడర్ రాజు యాదవ్ టికెట్ తనకే ఇవ్వాలని
సెంటర్లో బ్యానర్ కూడా పెట్టేశారు.
News November 22, 2025
‘మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి’

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(KGBV)ను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టోర్ రూంలో ఆహార సామగ్రి, కోడిగుడ్లు, కూరగాయలను కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆమె ఆరా తీశారు. విద్యార్థులు పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు.
News November 22, 2025
ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమేనా?

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే MLA దానం నాగేందర్ AICC పెద్దలతో సమావేశమయ్యారు. అనర్హత అనివార్యమైతే పదవి వదులుకోవాల్సిందే. రాజీనామా చేస్తే MLA టికెట్ తనకే ఇవ్వాలని ఆయన AICCని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశానని ఖైరతాబాద్ సీనియర్ లీడర్ రాజు యాదవ్ టికెట్ తనకే ఇవ్వాలని సెంటర్లో బ్యానర్ కూడా పెట్టేశారు.


