News March 12, 2025
అల్లూరి జిల్లాలో యువకుడిపై పోక్సో కేసు.!

అల్లూరి జిల్లా రాజవొమ్మంగి గ్రామానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశామని సీఐ సన్యాసి నాయుడు బుధవారం తెలిపారు. బాలిక ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న యువకుడు మాయమాటలు చెప్పి, మభ్యపెట్టి వేరే గ్రామానికి తీసుకుని వెళ్లాడని సీఐ తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 2, 2025
నల్గొండ: సర్పంచి గిరీ కోసం.. రూ.లక్షల్లో ఖర్చు!

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు, ఆశావహులు ఓట్ల వేటలో స్థాయికి మించి ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. కొందరు భూములు, బంగారం సైతం తాకట్టు పెడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిన్న చిన్న పంచాయతీల్లో సైతం ఒక్కో అభ్యర్థి రూ.నాలుగైదు లక్షలు ఖర్చు చేసే పరిస్థితి ఉంది. మామూలు పంచాయతీలో రూ.ఐదు లక్షల నుంచి రూ.పది లక్షల దాకా.. పెద్ద పంచాయతీల్లో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు.
News December 2, 2025
‘కోహ్లీ’ దిగ్గజాలను దాటేశారు: ఫ్యాన్స్

SAపై తాజా సెంచరీతో వన్డేల్లో కోహ్లీ 52 సెంచరీలు చేసి ఓ ఫార్మాట్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్గా నిలిచారు. అయితే సెంచరీల్లో దిగ్గజ ప్లేయర్లను విరాట్ ఎప్పుడో దాటేశారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కోహ్లీ వన్డేల్లో 294 ఇన్నింగ్స్ ఆడారని, ఇదే సంఖ్యలో ఆడిన తర్వాత సచిన్ సెంచరీలు 33 అని, పాంటింగ్ 26, గేల్ 25 శతకాలు బాదారని పోస్టులు పెడుతున్నారు. బ్యాటింగ్ AVG కూడా కోహ్లీ(58)దే ఎక్కువ అని చెబుతున్నారు.
News December 2, 2025
ఫోన్లలో Govt యాప్.. నిఘా కోసమేనా?

ఫోన్లలో ప్రభుత్వ ‘సంచార్ సాథీ’ యాప్ <<18439451>>డిఫాల్ట్గా<<>> ఉండాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేసే పేరుతో ప్రజలపై నిఘా పెట్టాలనుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రష్యా, నార్త్ కొరియా వంటి దేశాల్లోనే డిలీట్ చేసేందుకు వీలులేని ఇలాంటి యాప్స్ ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నార్త్ కొరియాలా తమపై నిఘా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?


