News July 24, 2024

అల్లూరి జిల్లాలో రేపు అన్ని పాఠశాలలకు సెలవు

image

జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టనందున, ఈనెల 25వ తేదీన కూడా అన్ని యాజమాన్య పాఠశాలలకు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు సెలవు అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులను తల్లిదండ్రులు బయటకు పంపించకూడదని, ప్రజలు గెడ్డలు, వాగులు దాటి ప్రయాణించకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.

Similar News

News December 5, 2025

ఆయుష్మాన్ భారత్ పథకంలో మధుమేహ రోగులను చేర్చాలి: ఎంపీ

image

ఆయుష్మాన్ భారత్ పథకంలో టైప్-1 మధుమేహం రోగులను, అవుట్ పేషెంట్ సేవలు కూడా చేర్చాలని ఎంపీ శ్రీ భరత్ పార్లమెంట్‌ సమావేశాల్లో కోరారు. ఇన్సులిన్, గ్లూకోజ్ లాంటి ముఖ్య ఔషధాలు ప్రజారోగ్య సంస్థల్లో నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సులిన్ ఒక మందు మాత్రమే కాదని, జీవనాధారమన్నారు. వీటి లభ్యత, ధరల సమస్య కారణంగా ఎవరూ ప్రాణం కోల్పోకూడదని, ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.

News December 5, 2025

విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలు

image

ప్రతిష్టాత్మకమైన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలు విశాఖ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ పోటీలకు విశాఖ నగరం ఆతిధ్యం ఇస్తున్నట్లు ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అద్యక్షుడు సుధాకర రెడ్డి తెలిపారు. శుక్రవారం బీచ్ రోడ్డులోని VMRDA పార్క్ స్కేటింగ్ రింక్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 11 విభాగాలలో జరిగే పోటీలకు 4000 మంది హాజరవుతారన్నారు

News December 5, 2025

విశాఖ: ‘డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేశారు’

image

డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న డెంకాడ వద్ద విశాఖకు చెందిన మహేష్ కుమార్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని రూరల్ CI లక్ష్మణ రావు తెలిపారు.