News March 9, 2025

అల్లూరి జిల్లాలో రైతు ఆత్మహత్య

image

రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామానికి చెందిన పి.సత్తిబాబు పొగాకు పంట సక్రమంగా పండలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ సన్యాసినాయుడు ఆదివారం తెలిపారు. సత్తిబాబు 2ఎకరాల్లో వేసిన పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు తీరవని మనస్తాపంతో 2రోజుల క్రితం పురుగుమందు తాగాడన్నారు. కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్‌కి తరలించి వైద్యం అందజేయగా.. నేడు మరణించినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News November 24, 2025

దీపాల కింద కూర్చుని చదువుకున్నా: CJI

image

ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన తాను <<18373221>>CJI<<>> అవుతానని ఎప్పుడూ అనుకోలేదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అప్పట్లో న్యాయవ్యవస్థ అంటే ఏంటో కూడా తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా ఊరికి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేది కాదు. దీపాల కింద కూర్చుని చదువుకున్నా. లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు సీనియర్లు ఎంతో సాయం చేశారు. హైకోర్టుకెళ్లాక 5-6 ఏళ్లలోనే విజయవంతమైన లాయర్‌గా పేరు తెచ్చుకున్నా’ అని చెప్పారు.

News November 24, 2025

నిజామాబాద్: కాంగ్రెస్, BRSపై అర్బన్ ఎమ్మెల్యే ఫైర్!

image

కాంగ్రెస్, BRSపై నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఫైర్ అయ్యారు. రైతులను గాలికి వదిలేయడంలో BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు దొందూ దొందే అని విమర్శించారు. రైతులకు ఎరువులు అందించడంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ విఫలమయ్యారని ట్వీట్ చేశారు.

News November 24, 2025

సింగూరు డ్యామ్‌లో 1 నుంచి ‘ఖాళీ’ పనులు

image

మహానగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం మరమ్మతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే ముందుగా జలాశయంలో నీటిమట్టం తగ్గించాలి. అందుకే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 30 సెంటీమీటర్లు నీటిని తోడేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిమట్టాన్ని 517.8 మీటర్లకు తెచ్చి (ప్రస్తుత నీటిమట్టం 520.49 మీ.) ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.