News May 3, 2024
అల్లూరి జిల్లాలో 130 ఏళ్ల ఉద్యమరాలు మృతి..!

అల్లూరి మన్యంలో పితూరి ఉద్యమంలో పాల్గొన్న మహిళ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం ఈతరొబ్బలు గ్రామానికి చెందిన పలాస సోములమ్మ గురువారం ఉదయం 8 గంటలకు మృతి చెందిందని తెలిపారు. ఆమె తల్లిదండ్రులతో కలిసి ఎన్నో గ్రామాలు తిరిగిందని.. 1924లో పిండి కుండల పితూరిలో పాల్గొన్నట్లు చెప్పారు. సోములమ్మ వయసు సుమారు 130 ఏళ్లు ఉంటుదని వారు తెలిపారు.
Similar News
News November 14, 2025
అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్: గంటా

అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాతగోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో సమస్యలు పెరిగాయని, త్వరలో నియామకం జరగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
News November 14, 2025
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు ఆత్మీయ వీడ్కోలు

ఏయూ వేదికగా నిర్వహించిన సిఐఐ సమ్మెట్లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు లభించింది. శుక్రవారం ఉదయం చేరుకున్న ఆయనకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఆయన వాయుమార్గంలో ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు.
News November 14, 2025
లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించండి: DMHO

ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించాలని DMHO జగదీశ్వరరావు అన్నారు. తరచుగా మూత్ర విసర్జన, మానసిక స్థితిలో, కళ్ల దృష్టిలో మార్పు, బరువు తగ్గడం,బలహీనతగా ఉండటం, ఎక్కువగా దాహం కలగడం వంటి లక్షణాల ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. దగ్గరలో ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసుకోవాలన్నారు.


