News February 23, 2025
అల్లూరి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలు

అల్లూరి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 26పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంటర్మీడియట్ జిల్లా విద్యా అధికారి అప్పలరాము శనివారం తెలిపారు. పాడేరు డివిజన్లో 16, రంపచోడవరంలో 6, చింతూరులోని 4 కేంద్రాల్లో 76 కళాశాలల నుంచి మొత్తం 14,720మంది పరీక్షలు రాస్తారన్నారు. మార్చి 1నుంచి 20వరకు వరకు పరీక్షలు జరుగుతాయాన్నారు. హాల్ టికెట్స్ ఇవ్వని కళాశాలలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
Similar News
News November 2, 2025
KNR: క్లెయిమ్ చేయని ఆస్తులపై క్లారిటీ ఇవ్వాలి: కలెక్టర్

క్లెయిమ్ చేయకుండా వదిలేసిన ఆస్తులపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ పమోలు సత్పతి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు, నామినీ వివరాలు తప్పనిసరిగా నింపాలని సూచించారు. ఉద్యోగం/ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లను చాలామంది పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.
News November 2, 2025
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి: కలెక్టర్ ఇలా

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె తిప్పర్తి(M) చిన్న సూరారం గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
News November 1, 2025
సానుభూతితో ఓట్లు దండుకోవాలనేది BRS యత్నం: రేవంత్

TG: జూబ్లీహిల్స్లో సానుభూతితో ఓట్లు దండుకోవాలని BRS ప్రయత్నిస్తోందని CM రేవంత్ ఆరోపించారు. ‘2007లో PJR చనిపోతే ఏకగ్రీవం కాకుండా అభ్యర్థిని నిలబెట్టే సంప్రదాయానికి KCR తెరదీశారు. పదేళ్ల పాటు మైనార్టీ సమస్యలు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 70వేల ఉద్యోగాలిచ్చాం. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన KTR.. సునీతను బాగా చూసుకుంటారా?’ అని విమర్శించారు.


