News March 6, 2025

అల్లూరి జిల్లాలో 650మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో గురువారం జరిగిన ప్రథమ ఇంటర్ పరీక్షలకు 650మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అప్పలరాం తెలిపారు. మాథ్స్, బోటనీ, సివిక్స్ పరీక్షలకు 6624మంది రాయవలసి ఉండగా 6169మంది హాజరు అయ్యారని, 455ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 1336మందికి గాను 1141మంది రాసారని, 195మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.

Similar News

News December 6, 2025

ఉల్లి పండిన నేలలో మల్లీ పూస్తుంది..

image

ఉల్లి సాగు సాధారణంగా శ్రమతో కూడుకున్నది. కొన్నిసార్లు కన్నీళ్లతో (ఉల్లి కోసేటప్పుడు) ముడిపడి ఉంటుంది. అలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్న నేలలో కూడా మంచి సస్యరక్షణ చేపడితే మల్లె వంటి సువాసనగల, అందమైన పంట పెరుగుతుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలతో కూడిన ఒక దశ ముగిసిన తర్వాత, అందమైన, సంతోషంతో కూడిన దశ ప్రారంభమవుతుందని, అంతా అయిపోయిన చోటు నుంచే కొత్త ఆశలు చిగురిస్తాయని ఈ సామెత అర్థం.

News December 6, 2025

శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఈ ప్రసాదాన్ని శనివారం రోజున నైవేద్యంగా పెడితే..?

image

శ్రీకృష్ణుడికి అటుకుల ప్రసాదమంటే ఎంతో ఇష్టమని పండితులు చెబుతున్నారు. శనివారం ఆయనకు అటుకులు, అన్నం, బెల్లం, కొబ్బరి తురుము కలిపి నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగి, ఇంట్లో ధనవృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. తేనె కలిపిన అటుకుల అన్నాన్ని ఆయనకు నివేదించి, ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచితే.. సంకటాలన్నీ హరించుకుపోతాయని విశ్వసిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలకు సుగుణాల భర్త వస్తాడని నమ్మకం.

News December 6, 2025

NRPT: అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

అప్పంపల్లిలో నవంబర్ 18న ఇంటి నుంచి<<18355152>> అదృశ్యమైన గోవర్ధన్ రెడ్డి<<>> <<18480571>>మృతదేహం శుక్రవారం లభ్యమైంది.<<>> ఆర్థిక సమస్యలు, మతిస్థిమితం లేమి కారణంగా ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గ్రామంలోని ఓ బావి పక్కన ఉన్న పొదల్లో ఆయన శవం లభ్యం కాగా, కుటుంబ సభ్యులు దుస్తుల ఆధారంగా గుర్తించి కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.