News March 5, 2025

అల్లూరి జిల్లాలో 650 మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ పరీక్షలకు 650మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అప్పలరాం తెలిపారు. జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్షకు 6, 773 మంది హాజరు కావాల్సి ఉందన్నారు. 6,324 మంది పరీక్షలు రాశారని.. 449మంది ఆబ్సెంట్ అయ్యారని చెప్పారు. 8 కేంద్రాల్లో 1,355మందికి 1,154 మంది ఒకేషనల్ పరీక్ష రాశారని చెప్పారు. 201 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

Similar News

News September 15, 2025

కేటీఆర్‌లా బెదిరింపు దావాలు వేయను: బండి

image

TG: KTR తనపై వేసిన <<17719172>>పరువునష్టం దావా<<>>పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్‌‌లా బెదిరింపుల కోసం దావాలు వేయను. దావా వేయాలనుకుంటే కేసీఆర్, కేటీఆర్ బయటికే రారు. మీరు తిట్టని తిట్లు లేవు. నేను లవంగం తింటే తంబాకు అన్నావ్. నన్ను వాడు, వీడు అన్నావ్. మీ అయ్య నా తల ఆరు ముక్కలు నరుకుతా అన్నాడు. వీటన్నింటిపై పరువు నష్టం దావా వేయరాదా?’ అని బండి ప్రశ్నించారు.

News September 15, 2025

మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు: భూమన

image

విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని చిత్తూరు తిరుపతి జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కోసం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి పద్మావతి సూపర్ స్పెషాలిటీలో పెండింగ్‌లో ఉన్న 20 శాతం పనులను పట్టించుకోవడం లేదన్నారు.

News September 15, 2025

విశాఖ: ‘వీకెండ్‌లో స్విగ్గీ, జోమోటో రైడర్ల సమ్మె’

image

విశాఖలో స్విగ్గీ, జోమోటో రైడర్లు ప్రతి శని, ఆదివారాల్లో సమ్మె చేయాలని తీర్మానించారు. జగదాంబలో సీఐటీయూ కార్యాలయంలో రైడర్ల సమావేశం జరిగింది.‌ జోమాటో యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందో? లేదో? చూస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కుమార్ అన్నారు. స్విగ్గీ యాజమాన్యం చర్చలకు రాలేదని తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.