News April 4, 2024

అల్లూరి జిల్లాలో 67 శాతం పింఛన్లు పంపిణీ

image

అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 67 శాతం పింఛన్లు పంపిణి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పింఛన్ల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News January 13, 2025

అనకాపల్లి: బాలిక పై అత్యాచారం

image

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలో ఐదేళ్ల బాలిక పై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన శనివారం జరగగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. బాలికను కేజీహెచ్‌కు తరలించారు.

News January 13, 2025

విశాఖ: 400 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిన ఆర్టీసీ

image

విశాఖ ద్వారక బస్సు స్టేషన్ నుంచి సంక్రాంతి సందర్భాన్ని పరిష్కరించుకుని 400 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపినట్లు రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌కు 25, విజయవాడకు 40 బస్సులు నడపగా, ఆదివారం శ్రీకాకుళం 100, రాజమండ్రికి 20, కాకినాడకు 20, పార్వతీపురానికి 40, సాలూరుకు 30 బస్సులతో పాటు రద్దీగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపామన్నారు.

News January 13, 2025

సింహాచలం ఆలయంలో నేడు గోదాదేవి కళ్యాణం

image

భోగి పండగ సందర్భాన్ని పరిష్కరించుకొని సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సోమవారం సాయంత్రం గోదాదేవి రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో త్రినాధరావు తెలిపారు. ఎదురు సన్నాహోత్సవం, కళ్యాణోత్సవ ఘట్టాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఉదయం జరగాల్సిన నిత్య కళ్యాణాన్ని గోదాదేవి కళ్యాణంతో జరిపిస్తామన్నారు.