News February 18, 2025

అల్లూరి జిల్లాలో 71 పరీక్షా కేంద్రాలు: డీఈవో

image

పదోతరగతి పరీక్షలకు అల్లూరి జిల్లాలో 71 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని DEO బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. పాడేరు డివిజన్‌లో 43, రంపచోడవరం డివిజన్‌లో 18, చింతూరు డివిజన్‌లో 10 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 11,766 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, వీరిలో 202 మంది ప్రైవేట్ స్టూడెంట్స్ ఉన్నారని వెల్లడించారు. 100రోజులు ప్రణాళికతో విద్యాబోధన జరుగుతుందన్నారు.

Similar News

News October 20, 2025

SRCL: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు..!

image

వరుస లొంగుబాట్లపై నిషేధిత CPI, మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కల్లపల్లి వాసుదేవరావు అలియాస్ సతీష్, ఆశన్న విప్లవ ద్రోహులుగా మిగిలిపోయారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కేంద్ర కమిటీ తాజాగా లేఖను విడుదల చేసింది. కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారు లొంగిపోయారని బహిరంగంగా ఆరోపించింది.

News October 20, 2025

WWC: భారత్ సెమీస్ చేరాలంటే?

image

WWCలో ఇంగ్లండ్‌పై ఓటమితో టీమ్‌ఇండియా సెమీస్ <<18053841>>ఆశలు<<>> సంక్లిష్టంగా మారాయి. రాబోయే రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై గెలిస్తేనే ఇతర జట్ల ప్రదర్శనతో సంబంధం లేకుండా సెమీస్ చేరనుంది. ఒకవేళ న్యూజిలాండ్‌తో మ్యాచులో టీమ్ఇండియా ఓడితే బంగ్లాపై తప్పక గెలవాలి. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో NZ ఓడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇతర జట్లతో పోలిస్తే మెరుగైన RR ఉంటేనే భారత్ సెమీస్ చేరనుంది.

News October 20, 2025

కోరుట్ల నుంచి మహోర్‌కు SPL. TOUR

image

కోరుట్ల డిపో నుంచి ఈనెల 26న మహోర్‌కు వన్డే ప్రత్యేక టూర్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఉదయం 4గం.లకు మహోర్‌(MH)కు బస్సు బయలుదేరి అదేరోజు రాత్రి తిరిగి కోరుట్లకు చేరుకుంటుందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ అందిస్తామని, ఒక్కరికి రూ.1,250లను ఛార్జిగా నిర్ణయించామన్నారు. రేణుక మాత(ఎల్లమ్మ, పరశురాము), దత్తాత్రేయ పీఠం, ఏకవీర శక్తిపీఠం, ఉంకేశ్వర్ శివాలయాల దర్శనాలు ఉంటాయి.