News March 11, 2025

అల్లూరి జిల్లాలో 71 పరీక్ష కేంద్రాలు

image

అల్లూరి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 71 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు తెలిపారు. మంగళవారం పాడేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 258 పాఠశాలలకు చెందిన 11,766 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలురు 5,476, బాలికలు 6,290 మంది ఉన్నారు. నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 20 సెంటర్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Similar News

News November 21, 2025

స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి.. రాజీనామా ప్రచారం?

image

TG: పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన నోటీసుకు MLA కడియం శ్రీహరి స్పందించారు. గడువు(23)కు ముందే ఆయన్ను కలిసి వివరణకు మరింత సమయం కావాలని కోరారు. దీనిపై సభాపతి సానుకూలంగా స్పందించారు. మరోవైపు 2రోజుల్లో శ్రీహరి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు వేడిలోనే స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ బైపోల్‌కు వెళ్లి BRSను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ స్కెచ్ వేసినట్లు చర్చ జరుగుతోంది.

News November 21, 2025

NRPT: ఆర్టీఐకి స్పందన కరువు.. విచారణకు నోటీసులు

image

దామరగిద్ద మండలంలో కంది, వేరుశనగ విత్తనాల పంపిణీ, రైతు బీమా లబ్ధిదారుల వివరాలు కోరుతూ సెప్టెంబరు 23న ఆర్టీఐ దరఖాస్తు చేసినా స్పందన రాలేదు. దీంతో అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్‌కు అప్పీల్ చేసినట్లు ఆర్టీఐ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు కొనింటి నర్సింలు తెలిపారు. దీనిపై ఏడీఏ స్పందించి, విచారణకు సోమవారం హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

News November 21, 2025

ధర్మారం: పిల్లల కోసం వినూత్న కార్యక్రమాలు.. సత్కారం

image

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఈరవేణి రాజ్ కుమార్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా పిలిచి సత్కరించారు. SEPT 2024 నుంచి ఆయన నూతన ఆలోచనలతో నాణ్యమైన విద్య, SPC, మాసపత్రిక, రేడియో FM 674.26, ప్లాస్టిక్‌ రహిత పాఠశాల, మీల్స్ విత్ స్టూడెంట్స్, ప్లే ఫర్ ఆల్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. విద్యార్థుల అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించిన కమిషనర్ రాజ్ కుమార్‌ను అభినందించారు.