News March 11, 2025
అల్లూరి జిల్లాలో 71 పరీక్ష కేంద్రాలు

అల్లూరి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 71 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు DEO బ్రహ్మాజీరావు తెలిపారు. మంగళవారం పాడేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 258 పాఠశాలలకు చెందిన 11,766 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలురు 5,476, బాలికలు 6,290 మంది ఉన్నారు. నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 20 సెంటర్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
Similar News
News March 21, 2025
CUET UG దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) <
News March 21, 2025
పచ్చళ్లు అతిగా తింటే క్యాన్సర్ రావొచ్చు!

అతిగా పచ్చళ్లు తినడం ప్రమాదకరమని ప్రముఖ వైద్యుడు శ్రీకాంత్ పేర్కొన్నారు. ‘పచ్చళ్ళలో పెరిగే శిలీంధ్రాలు (బూజు/ఫంగస్) నైట్రేట్లని నైట్రైట్లుగా మారుస్తాయి. ఇవి క్యాన్సర్ కారకాలు. అప్పుడప్పుడూ తిన్నవారిని ఇవేం చేయలేవు. కానీ, అదేపనిగా తింటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ ఇది ప్రమాదకరమే. నిలువ పచ్చళ్ల కంటే అప్పుడే చేసిన రోటి పచ్చళ్లు సేఫ్’ అని తెలిపారు.
News March 21, 2025
విశాఖ మేయర్ పీఠం కదలనుందా?

విశాఖ మహా నగర మేయర్ హరివెంకటకుమారిపై ఆవిశ్వాసం తప్పేలా లేదు. ఈ క్రమంలో కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కూటమి బలం ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి70కి చేరుకుంది. మరికొన్ని రోజులలో TDP, జనసేనలో కార్పొరేటర్లు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. TDP ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాస్ కలెక్టర్ &జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేదేంద్రప్రసాద్ని కలిసి అవిశ్వాస తీర్మాన లేఖ ఇవ్వనున్నట్టు సమాచారం.