News February 4, 2025
అల్లూరి జిల్లాలో 8 సెంటర్లు: డీఈవో

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం, టైం టేబుల్ ప్రకారం ఇంటర్(APOSS) పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరుగుతాయని DEO బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 8 సెంటర్లు కేటాయించామన్నారు. అరకులోయ-1, పాడేరు-1, చింతూరు-1, చింతపల్లి -2, రంపచోడవరం-3 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో 1699 మంది పరీక్షలు రాయనున్నారని తెలపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News November 16, 2025
HYD: వ్యర్థాలపై యోగా.. ఎంటనుకుంటున్నారా?

రోడ్డు పక్కన నిర్మాణ వ్యర్థాలపై వ్యక్తి యోగా చేయటం ఏంటని అనుకుంటున్నారా? ఇది నిజమే. శేర్లింగంపల్లి జోన్ కల్వరి టెంపుల్ రోడ్డులో ఓవైపు నిర్మాణ వ్యర్థాల, మరోవైపు డ్రైనేజీ సిల్ట్ రోడ్డుకు ఇరుపక్కల మీటర్ల కొద్ది ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో సూర్య కిరణాలు శరీరాన్ని తాకేలా ఆ వ్యర్థాలపై యోగా చేస్తూ పరిస్థితిని వివరించారు.
News November 16, 2025
KNR: దివ్యాంగురాలి అనుమానాస్పద మృతి

KNRలోని వావిలాలపల్లిలో శనివారం దివ్యాంగురాలైన అర్చన(15) అనుమానాస్పదంగా మృతిచెందింది. ఆమె సోదరుడు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కిరాణా షాప్కు వెళ్లి వచ్చేసరికి ఇద్దరూ స్పృహ కోల్పోయి కనిపించారు. ఆసుపత్రికి తరలించగా అర్చన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగినప్పటి నుంచి వారి తండ్రి మల్లేషం కనిపించడం లేదు. KNR-3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 16, 2025
‘దమ్ముంటే పట్టుకోండి’ అన్నోడిని పట్టుకున్నారు: సీవీ ఆనంద్

TG: Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని <<18292861>>అరెస్టు <<>>చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు. ‘‘జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది. ‘దమ్ముంటే పట్టుకోండి’ అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసింది. DCP కవిత, CP సజ్జనార్కు కంగ్రాట్స్’’ అని ట్వీట్ చేశారు.


