News February 4, 2025
అల్లూరి జిల్లాలో 8 సెంటర్లు: డీఈవో

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం, టైం టేబుల్ ప్రకారం ఇంటర్(APOSS) పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరుగుతాయని DEO బ్రహ్మాజీరావు సోమవారం తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 8 సెంటర్లు కేటాయించామన్నారు. అరకులోయ-1, పాడేరు-1, చింతూరు-1, చింతపల్లి -2, రంపచోడవరం-3 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో 1699 మంది పరీక్షలు రాయనున్నారని తెలపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News February 18, 2025
MNCL: 30వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్షలు

మంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంట్ ఎదుట కార్మికులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు నేటితో 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ.. ప్లాంట్ మూసివేసి 26 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యాజమాని, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
News February 18, 2025
అల్లు అర్జున్ సినిమాలో జాన్వీ కపూర్?

ఐకాన్స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ చిత్రం దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్తోనే అని బన్నీఒక ప్రైవేట్ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ షెడ్యూల్ తదితర కారణాల రీత్యా పుష్ప-2 తర్వాత తన తదుపరి చిత్రం అట్లీతో చేయనున్నారట. ఈ మూవీపై పూర్తి అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయి.
News February 18, 2025
ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్ సీఐ, కానిస్టేబుళ్లు

ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుళ్లు పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఒక కేసు విషయంలో మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు శివారెడ్డి, నరసింహులు రూ.20వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.