News February 2, 2025

అల్లూరి జిల్లాలో 95.69% పింఛను పంపిణీ పూర్తి

image

అల్లూరి జిల్లాలో శనివారం రాత్రి 9 గంటలకు 95.69% పింఛన్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా 22 మండలాల్లో 1,23,361 మంది పించన్ దారులకు 51.74 లక్షల సొమ్ము రిలీజ్ అయిందన్నారు. వీటిలో 1,18,041 మందికి రూ. 49.40లక్షల సొమ్ము పింఛన్లు పంపిణీ చేసామన్నారు. మిగిలిన 5,615 మందికి త్వరితగతిన పింఛను పంపిణీ పూర్తి చేస్తామన్నారు. అరకులోయలో కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు.

Similar News

News November 18, 2025

నీట్, జేఈఈ శిక్షణ ఇవ్వాలి: కలెక్టర్ స్నేహ శబరీష్

image

ప్రభుత్వ జూనియర్, గురుకుల కళాశాలల విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా కోచింగ్ ఇవ్వాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్, సంక్షేమ విద్యాలయాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News November 18, 2025

రేపు పుట్టపర్తికి వస్తున్నా: PM మోదీ

image

సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు తాను రేపు పుట్టపర్తికి వస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత కోసం బాబా చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకమని ప్రధాని పేర్కొన్నారు. గతంలో బాబాతో తనకు అనేక సందర్భాల్లో సంభాషించే అవకాశం లభించిందని, ఆ అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

News November 18, 2025

కామారెడ్డి: ఇళ్ల లక్ష్యాలు పకడ్బందీగా సాధించాలి: కలెక్టర్

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మాచారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్ మండలాల ఎంపీడీవోలతో జరిగిన ఈ సమావేశంలో.. మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. లక్ష్యాలను వంద శాతం చేరుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుని, పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు.