News April 24, 2024
అల్లూరి జిల్లా కలెక్టర్ను కలిసిన క్రికెటర్ రవని

అల్లూరి జిల్లా కలెక్టర్ విజయ సునీతను అంధుల క్రికెటర్ వలసనేని రవని కలిశారు. ఆల్ ఇంగ్లాండ్ అంధుల క్రికెట్ ప్రపంచ పోటీలలో గెలిచిన టీంలో ఈమె సభ్యురాలిగా ఉన్నారు. ఆల్ రౌండ్ ప్రతిభతో 2023లో బంగారు పతకం సాధించారు. రవని కుటుంబ సభ్యులు పరిస్థితులు, మెరుగైన క్రికెట్ ఆడేందుకు అవసరమైన సాయం చేయాలని విన్నవించగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఓట్లు వేసేందుకు యువతను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆమెకు సూచించారు.
Similar News
News April 22, 2025
సింహాచలంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు

సింహాచలం వరహాలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో సుబ్బారావు సోమవారం తెలిపారు. ఈనెల 26 సాయంత్రం నుంచి భక్తులు కొండ కింద వరాహ పుష్కరిణి వద్ద జాగరము ఉండి స్నానమాచరించి స్వామి వారి దర్శనము చేసుకొని వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఏప్రిల్ 28 నుంచి మే2 వరకు ఆలయంలో తిరునక్షత్ర మహోత్సవము నిర్వహించనున్నారు. పైతేదీలలో అన్ని రకాల సేవలు రద్దు చేశారు.
News April 22, 2025
K.G.Hలో టీచర్లకు వైద్య శిబిరాలు

బదిలీల్లో ప్రాధాన్యత క్యాటగిరీ కిందకు వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 24 నుంచి 26 వరకు K.G.Hలో ప్రత్యేక వైద్య శిబిరానికి హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ కోరారు. 24న విశాఖ, 25న అనకాపల్లి, 26న అల్లూరి జిల్లాలకు చెందినవారు వైద్య శిబిరాలకు హాజరు కావాలన్నారు. ఈ శిబిరంలో పొందిన సర్టిఫికెట్ల ఆధారంగా కేటగిరీలను వర్గీకరిస్తామని తెలిపారు.
News April 21, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 113 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్లో సోమవారం 113 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. ప్రజలు నుంచి నేరుగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి అర్జీదారులతో స్వయంగా మాట్లాడాలని ఆదేశించారు. ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని చట్టపరంగా సమస్య పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.