News June 30, 2024

అల్లూరి జిల్లా: భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు

image

భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి ఈనెల 25న మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈ తంతు జరిగింది. గ్రామానికి చెందిన పండన్న మొదటి భార్యకు పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2007లో బాబు పుట్టాడు. మరో సంతానం కావాలంటూ భర్త ఇద్దరికీ చెప్పాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికి కార్డులు కొట్టించి, బ్యానర్లు కట్టించారు. ఈ నెల 25న అందరి సమక్షంలో అక్షింతలు వేసి పెళ్లి చేశారు.

Similar News

News October 27, 2025

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రేపు సెలవు

image

మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు తరగతుల రద్దు చేశారు. విద్యార్థులను హాస్టల్స్‌కు పరిమితం కావాలని అధికారులు సూచించారు. తుఫాను తీవ్రత పెరగడం, వర్షం అధికమవడంతో వర్సిటీ అధికారులు, ఉద్యోగులకు సైతం రేపు సెలవు ప్రకటించారు.

News October 27, 2025

విశాఖ: ‘29న‌ టిఫ‌న్, భోజ‌నం ప్యాకెట్ల‌ను సిద్దం చేసుకోవాలి’

image

ఈనెల 28న గంట‌కు 150-200 KM వేగంతో తుపాను తీరం దాటే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్ జైన్ పేర్కొన్నారు. సోమవారం విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. తీరం దాటే ప్ర‌భావంతో చాలా న‌ష్టం వాటిల్ల వ‌చ్చ‌ని, విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌వ‌చ్చ‌న్నారు. తుపాను ప్ర‌భావిత ప్రాంత ప్రజలకు అల్పాహారం, భోజ‌నం ప్యాకెట్ల‌ను అందించేందుకు యంత్రాంగం సంసిద్ధంగా ఉండాల‌ని ఆదేశించారు.

News October 27, 2025

విశాఖ: డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీడీగా కె.రజిత

image

విశాఖలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరక్టరుగా కె.రజిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె విజయనగరం, అనకాపల్లి ప్రాంత డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. 2013లో ఆమెకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2013 నుంచి 2016 వరకు అసిస్టెంట్ డైరెక్ట్‌గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.