News June 30, 2024

అల్లూరి జిల్లా: భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు

image

భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి ఈనెల 25న మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈ తంతు జరిగింది. గ్రామానికి చెందిన పండన్న మొదటి భార్యకు పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2007లో బాబు పుట్టాడు. మరో సంతానం కావాలంటూ భర్త ఇద్దరికీ చెప్పాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికి కార్డులు కొట్టించి, బ్యానర్లు కట్టించారు. ఈ నెల 25న అందరి సమక్షంలో అక్షింతలు వేసి పెళ్లి చేశారు.

Similar News

News November 18, 2025

పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

image

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.

News November 18, 2025

పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

image

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.

News November 18, 2025

సింహాచలం: తోటలో చిరు వ్యాపారి ఆత్మహత్య

image

అప్పులు బాధ తట్టుకోలేక చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ఆరిలోవ ప్రాంతానికి చెందిన జరజాపు వెంకట అజయ్ కుమార్ వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు. అప్పులు ఎక్కువ కావడంతో సింహాచలం సమీపంలోని లండగరువు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాలపట్నం సీఐ ఎల్.సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.