News February 4, 2025

అల్లూరి: ట్యాంకర్ బోల్తా పడి వ్యక్తి మృతి

image

జాతీయ రహదారి పనుల్లో భాగంగా వాటరింగ్ చేస్తున్న ట్యాంకర్ బోల్తా కొట్టడంతో క్లీనర్ నాగరాజు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. కొయ్యూరు మండలంలోని మట్టపనుకుల వద్ద సోమవారం రాత్రి జరిగింది. నాగరాజు ట్యాంకర్ క్రింద ఉండిపోవడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మృతుని స్వగ్రామమైన ఎం.మాకవరంలో విషాదం నెలకొంది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిశోర్ వర్మ తెలిపారు.

Similar News

News February 19, 2025

కొవ్వూరు : గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

image

కొవ్వూరు ఇంటిలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న డేవిడ్ రాజు మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

News February 19, 2025

గుంటూరు: MDMA వినియోగిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్ 

image

MDMA నిషేధిత మత్తు పదార్థాలను విక్రయిస్తూ, వినియోగిస్తున్న 9 మంది ఇంజినీరింగ్ విద్యార్థులను గుంటూరు ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన నితిన్ కాజ గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయికృష్ణకు MDMA విక్రయించాడు. ఆ మత్తు పదార్థాలను సాయికృష్ణ గోరంట్లలో ఉంటూ ఇంజినీరింగ్ కళాశాలలకు విక్రయించాడు. మొత్తం 11 మంది ఉండగా 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. 

News February 19, 2025

కరీంనగర్ : 28 నుంచి LLB పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని మూడు సంవత్సరాల LLB పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 28 నుంచి మార్చి 5 తేదీ వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి 5 గంటల వరకు జరగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ చూడాలని, సంబంధిత కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

error: Content is protected !!