News February 10, 2025
అల్లూరి: నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది దాఖలు చేశారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
Similar News
News December 17, 2025
దేవదేవుని లక్షణాలు – ఒకే శ్లోకంలో

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః|
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||
అన్నీ తెలిసినవాడు, సకల విద్యలకు మూలమైనవాడు, నిత్యం జ్ఞానరూపంలో ఉండేవాడు, దుష్టులను సంహరించి ధర్మాన్ని రక్షించేవాడు, తత్త్వజ్ఞానానికి అధిపతి, లక్ష్మీదేవికి భర్త, మధురమైనవాడు, ఇంద్రియాలకు అందనివాడు, మాయలన్నిటికీ కారణభూతుడు, సృష్టి కార్యాలు చేయువాడు, అనంత శక్తి, గొప్ప సంపద కలవాడు.. ఆయనే శ్రీమహావిష్ణువు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 17, 2025
ఎల్లారెడ్డిపేట: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ బుధవారం పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, అల్మాస్ పూర్, గొల్లపల్లి, వీర్నపల్లి మండలంలోని కంచర్ల, వీర్నపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో ఆవరణ, కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
News December 17, 2025
కామారెడ్డి జిల్లాలో మూడో విడత తొలి ఫలితం

నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంప్ సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. అంకోల్ క్యాంప్ సర్పంచ్గా అనిత-రాములు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అనితకు 209 మెజారిటీ వచ్చింది. తన సమీప ప్రత్యర్థి సావిత్రికి 36 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లు చెల్లలేదు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


