News February 10, 2025
అల్లూరి: నామినేషన్ల దాఖలుకు నేడు ఆఖరు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది దాఖలు చేశారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
Similar News
News October 14, 2025
హైకోర్టు స్టేపై సుప్రీంలో పిటిషన్.. నేడే విచారణ!

TG: BC రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసును రిఫరెన్స్గా చూపింది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50% రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది.
News October 14, 2025
మెదక్: కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి..

మెదక్(D) నిజాంపేటలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మృతి చెందాడనే మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన జ్యోతి(41) బతుకుదెరువు కోసం మహబూబ్నగర్ వెళ్లారు. అక్కడ ఆమె కొడుకు అనిల్ నెల రోజుల క్రితం పిట్స్ రావటంతో ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి ఇంట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు SI రాజేశ్ కేసు నమోదు చేశారు.
News October 14, 2025
పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.