News March 27, 2025
అల్లూరి: నేడు ఈ 10 మండలాల ప్రజలు జాగ్రత్త

అల్లూరి జిల్లాలలో నేడు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ఆర్. కూర్మనాథ్ బుధవారం హెచ్చరికలు జారీ చేశారు. వడగాల్పుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అడ్డతీగల, చింతూరు, దేవిపట్నం, గంగవరం, కొయ్యూరు, కూనవరం, నెలిపాక, రాజవొమంగి, రంపచోడవరం, వరరామచంద్రపుర్ లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు.
Similar News
News November 26, 2025
జగిత్యాలలో మొత్తం ఓటర్లు 6,07,263 లక్షల మంది

జగిత్యాల జిల్లాలో మొత్తం 6,07,263 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఇందులో 2,89,702 మంది పురుషులు, 3,17,552 మంది మహిళలు, 9 మంది ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషమన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.
News November 26, 2025
జగిత్యాలలో శాంతియుత ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి

గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 7 మండలాల్లో 122 పంచాయతీలకు, రెండవ విడతలో 144, మూడవ విడతలో 119 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
News November 26, 2025
జగిత్యాల: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజ గౌడ్ (లోకల్ బాడీస్) తదితరులు పాల్గొన్నారు.


