News February 17, 2025

అల్లూరి: నేడే ప్రారంభం 

image

అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ కొయ్యూరు మండలంలో పర్యటించనున్నారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కలెక్టర్ పర్యటనలో భాగంగా ముందుగా ఆయన లంకవీధి గ్రామానికి చేరుకుంటారు. అనంతరం అల్లూరి సీతారామరాజు అనుచరులైన గాము గంటన్నదొర, మల్లుదొరల కుటుంబ సభ్యుల కోసం నిర్మించిన పక్కా గృహాలను ప్రారంభించనున్నారు. 

Similar News

News November 2, 2025

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలు మానుకోవాలి: రేగా

image

తెలంగాణ భవన్ పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు SMద్వారా తెలిపారు. మణుగూరు కేంద్రంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. దమ్ముంటే DMFTనిధులతో రోడ్లు బాగు చేయాలని చెప్పారు. ఈ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పేవరకు వదలమని హెచ్చరించారు.

News November 2, 2025

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 16 ఉద్యోగాలు

image

ఆయిల్ ఇండియా లిమిటెడ్(<>IOL<<>>) దులియాజాన్‌లో 16 కాంట్రాక్టువల్ డ్రిల్లింగ్/వర్క్ఓవర్ ఆపరేటర్, వర్క్‌ఓవర్ అసిస్టెంట్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా లేదా సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://www.oil-india.com/ను సంప్రదించండి.

News November 2, 2025

ప్రతిరోజు తప్పక పఠించాల్సిన 4 మంత్రాలు

image

☞ ‘ఓం గం గణపతయే నమః’ రోజూ ఈ మంత్రం పఠించడం వల్ల అడ్డంకులు తొలగి, అంతర్గత శాంతి లభిస్తుంది.
☞ ‘ఓం నమః శివాయ’ ఈ పంచాక్షరీ మంత్రం ఏకాగ్రతను, సానుకూల శక్తిని, మానసిక బలాన్ని పెంచుతుంది.
☞ ‘ఓం హం హనుమతే నమః’ ఈ మంత్రం శారీరక బలంతో పాటు మీలో ధైర్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
☞ ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ ఈ మంత్ర జపం సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. మీకు బలాన్ని పెంపొందిస్తుంది