News February 17, 2025
అల్లూరి: నేడే ప్రారంభం

అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ కొయ్యూరు మండలంలో పర్యటించనున్నారని కలెక్టర్ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కలెక్టర్ పర్యటనలో భాగంగా ముందుగా ఆయన లంకవీధి గ్రామానికి చేరుకుంటారు. అనంతరం అల్లూరి సీతారామరాజు అనుచరులైన గాము గంటన్నదొర, మల్లుదొరల కుటుంబ సభ్యుల కోసం నిర్మించిన పక్కా గృహాలను ప్రారంభించనున్నారు.
Similar News
News April 17, 2026
GNT: తెనాలిలో న్యూడ్ వీడియో కాల్స్ (UPDATE)

గుంటూరు (D) తెనాలిలో చెంచుపేట కేంద్రంగా న్యూడ్ వీడియో కాల్స్ దందా వెలుగులోకి వచ్చిన <<19645040>>విషయం తెలిసిందే.<<>> ఆన్లైన్ పోర్టల్ ద్వారా మహిళలతో న్యూడ్ వీడియో కాల్స్ చేయిస్తున్న వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరిలో ఒకరి కుమారుడు పరారీలో ఉండగా గాలిస్తున్నట్లు పోలీసుల తెలిపారు. లీగల్ ఒపీనియన్తో గురువారం రాత్రి సుమోటోగా కేసు నమోదు చేశామన్నారు.
News April 17, 2026
హైదరాబాద్లో మరో సైబర్ టవర్!

TG: హైదరాబాద్లో ఐటీ విప్లవానికి గుర్తుగా నిలిచిన సైబర్ టవర్స్ తరహాలో మరో అత్యాధునిక పరిపాలనా భవనం నిర్మితం కానుంది. కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కోసం ఐకానిక్ బిల్డింగ్ను 8 అంతస్తుల్లో నిర్మించనున్నారు. దీనికి రూ.200 కోట్లతో ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలును సీఎం పరిశీలనకు పంపారు. కైత్లాపూర్లోని ఐదెకరాల భూమిని అధికారులు ఎంపిక చేశారు.
News April 17, 2026
కోనసీమ: ఒకే విగ్రహం, రెండు రూపాలు!

ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ గ్రామంలో శ్రీ మహావిష్ణువు అరుదైన రూపంలో దర్శనమిస్తారు. ఒకే నల్లరాయిపై ముందు వైపు మహావిష్ణువు, వెనుక వైపు స్త్రీ రూపమైన జగన్మోహినిగా ఈ విగ్రహాన్ని మలిచారు. స్వామి పాదాల నుంచి గంగమ్మ నీటి ధారలు నిరంతరం ప్రవహించడం ఇక్కడి విశేషం. ఈ దేవాలయాన్ని సందర్శించిన పర్యాటకులు చాళుక్య శిల్పకళా వైభవాన్ని చూసి పరవశించిపోవడం ఖాయమని భక్తులు చెబుతారు.


