News April 2, 2025
అల్లూరి: పాలీసెట్ పరీక్షకు ఉచిత శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశ పాలీసెట్-2025 పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అల్లూరి జిల్లా పాడేరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.సుజాత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 2 నుంచి పాలీసెట్ కోచింగ్కు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News December 4, 2025
తిరుపతి: 11 ఏళ్ల అంధ మారథాన్ అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగులు

ప్రపంచ రికార్డు సాధన దిశగా 11 ఏళ్ల అంధ బాలుడు మురారి హర్షవర్ధన్ ముందడుగు వేశాడు. హర్షవర్ధన్ నాన్-స్టాప్ 200 km బ్లైండ్ మల్టీ-టాస్క్ రోడ్డు స్కేటింగ్ మారథాన్ను ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి చేయనున్నారు. ఈ అరుదైన సాహసానికి AP శాప్ ఛైర్మన్ రవినాయుడు అండగా నిలిచారు. మారథాన్కు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయంతో పాటు, అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించాలని చిత్తూరు, తిరుపతి క్రీడా అధికారులను ఆదేశించారు.
News December 4, 2025
బాలాజీ రైల్వే డివిజన్ కోసం వినతి

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని సాధన సమితి నాయకులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను న్యూఢిల్లీలో కలిశారు. మంత్రి రామ్మోహన్ నాయుడు, లావు కృష్ణదేవరాయలు, ఎంపీ దుర్గాప్రసాద్తో కలిసి సమితి వినతిపత్రం సమర్పించారు. రాయలసీమ అభివృద్ధికి డివిజన్ అవసరమని తెలిపారు. రేణిగుంట, తిరుచానూరు స్టేషన్ల అభివృద్ధితో పాటు సింహపురి ఎక్స్ప్రెస్ను రేణిగుంట వరకు పొడిగించాలని కోరారు.
News December 4, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్ను ఆపుకోవడం, బాత్రూమ్లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.


