News April 2, 2025
అల్లూరి: పాలీసెట్ పరీక్షకు ఉచిత శిక్షణ

రాష్ట్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశ పాలీసెట్-2025 పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అల్లూరి జిల్లా పాడేరు జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.సుజాత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 2 నుంచి పాలీసెట్ కోచింగ్కు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 25, 2025
ఆమె చదువు అమూల్యం.. అతని సాయం చిరస్మరణీయం

AP: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని అమూల్యకు టెన్త్లో 593 మార్కులు వచ్చాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ చదువుల తల్లిని కలెక్టర్ అరుణ్బాబు సత్కరించారు. ఆమె పేరెంట్స్ అనిల్, రూతమ్మ కూలి పనులకు వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకుని ఆయన చలించిపోయారు. వెంటనే ఒక ఎకరం పొలం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
News April 25, 2025
పిట్లం: తర్బూజా సాగు.. లాభం బహు బాగు..!

బతుకు దెరువు కోసం 10 ఏళ్లు దుబాయ్ వెళ్లిన వ్యక్తి సొంత గడ్డపై వ్యవసాయం చేస్తూ లాభాల పంట పండిస్తున్నాడు. పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన సలీం ఖాన్ పిట్లంలో ఆరు ఎకరాల భూమిని ఏడాదికి రూ. 1.20 లక్షలకు కౌలుకు తీసుకుని తర్బూజా సాగు చేపట్టాడు. ఇందుకు రూ. 4.50 లక్షల పెట్టు బడి పెట్టాడు. ప్రస్తుతం పంట బాగా రావడంతో ఏకంగా రూ. 9 లక్షల లాభం పొందాడని సలీమ్ Way2 Newsతో గురువారం తెలిపాడు.
News April 25, 2025
విశాఖ రేంజ్లో 9 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను గురువారం డీఐజీ గోపినాథ్ జెట్టి బదిలీ చేశారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు తక్షణమే సంబంధిత బదిలీ స్థానంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళ జిల్లాకు బదిలీ అయ్యారు.