News March 2, 2025
అల్లూరి: పెరిగిన చికెన్ ధరలు..కేజీ రూ.200

అల్లూరి జిల్లాలో చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం నాటికి లైవ్ చికెన్ కేజీ రూ.90 ఉండగా, స్కిన్ రూ.180, స్కిన్ లెస్ రూ.200గా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనుగోలుపై మాంసాహార ప్రియులు ఆసక్తి కనబరచడంతో చికెన్ ధరలు తగ్గాయి. తాజాగా మూడు రోజుల వ్యవధిలో చికెన్ ధర సుమారు రూ.20 పెరగడంతో ఆదివారం నాటికి కొయ్యూరులో కిలో చికెన్ రూ.200(స్కిన్ లెస్) అమ్మకాలు చేపట్టారు.
Similar News
News November 28, 2025
వరంగల్: సామన్లు సర్దుకున్న పెద్దాయన!

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడిన పెద్దాయన హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలోని విలువైన వస్తువులను, ఫర్నిచర్లను తన ఇంటికి తరలించారు. అక్ర‘మార్కుల’ కేసులో వేటు తప్పదనే ఉద్దేశ్యంతో తన క్యాంపు కార్యాలయాల్లోని సామగ్రిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని సమాచారం.
News November 28, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 28, 2025
అరికాళ్ల మైసమ్మ ఆలయం కట్టడాల తొలగింపు

వేములవాడ పట్టణంలో పురాతనమైన అరికాళ్ల మైసమ్మ ఆలయ పరిసర కట్టడాలను తొలగించారు. ఆలయం ముందు భాగంలో మెయిన్ రోడ్ విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా భవనాలను కూల్చివేసిన క్రమంలో తాజాగా అరికాళ్ల మైసమ్మ ఆలయం పక్కన ఉన్న నిర్మాణాలను పూర్తిగా తొలగించారు. 400 ఏళ్ల చరిత్ర, రోడ్డుకు దిగువన ఉన్న అరికాళ్ల మైసమ్మ ఆలయం లోపలి భాగాన్ని అలాగే ఉంచి రక్షణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు.


