News February 18, 2025
అల్లూరి: యాక్సిడెంట్లో యువకుడి మృతి

జీ.మాడుగుల-మద్దిగరువు ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయలపాలైనా కర్రి శ్రీను సోమవారం మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం ప్రమాదం జరిగిన అనంతరం పోలీసు శాఖ చొరవ తీసుకొని పాడేరు తరలించారు. సోమవారం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు పెందుర్తి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Similar News
News April 10, 2026
నన్నయ్య యూనివర్సిటీ స్నాతకోత్సవాలకు ఎమ్మెల్యే బత్తుల

రాజానగరంలో శ్రీ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 16, 17వ స్నాతకోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ గవర్నర్కు దుశ్శాలువతో సత్కరించి స్వాగతం పలికారు. కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.
News April 10, 2026
జనగామ నేతలతో TPCC చీఫ్ సమావేశం

గాంధీభవన్లో జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలతో TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల కమిటీల నియామక ప్రక్రియ, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు మహేశ్ కుమార్ గౌడ్ దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ నేతలు పాల్గొన్నారు.
News April 10, 2026
50 మిలియన్ యూనిట్ల వినియోగం పెరిగింది: HNK ఎస్ఈ

గడిచిన త్రైమాసికంలో జిల్లాలో సుమారు 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. గృహ, వాణిజ్య, పరిశ్రమల కేటగిరీలు కలిపి జిల్లాలో మిలియన్ యూనిట్ల వారిగా జనవరి మాసంలో 139.120, ఫిబ్రవరిలో 147.860, మార్చిలో 189.050 రికార్డు నమోదయింది. వేసవిలో వినియోగదారుల డిమాండ్ మేరకు ఎలాంటి అంతరాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ మధుసూదన్ రావు తెలిపారు.


