News February 18, 2025

అల్లూరి: యాక్సిడెంట్‌లో యువకుడి మృతి

image

జీ.మాడుగుల-మద్దిగరువు ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయలపాలైనా కర్రి శ్రీను సోమవారం మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆదివారం ప్రమాదం జరిగిన అనంతరం పోలీసు శాఖ చొరవ తీసుకొని పాడేరు తరలించారు. సోమవారం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు పెందుర్తి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Similar News

News March 22, 2025

HYD: భార్య వీడియోలు భర్తకు పంపి.. బ్లాక్ మెయిల్!

image

విదేశంలో HYD యువతికి వేధింపులు ఎదురయ్యాయి. శ్రీకృష్ణానగర్‌ వాసి 2018లో పనికోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన అబూబాకర్ ఆమె వ్యక్తిగత వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. 2020లో బాధితురాలు HYD వచ్చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. కాల్ చేసినా ఆమె బయటకురావడం లేదని ఆ వీడియోలు ఆమె భర్తకు పంపాడు. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 22, 2025

నేడు ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు

image

తెలంగాణలో వర్షాలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. నిన్న కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది.

News March 22, 2025

ALERT: సాతర్లలో గరిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదు

image

గద్వాల జిల్లాలో 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. శుక్రవారం సాతర్లలో గరిష్ఠంగా 39.5, తోతినోనిదొడ్డి, ధరూర్, గద్వాల్, అలంపూర్‌లో 39.3 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితేనే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.

error: Content is protected !!