News April 7, 2025

అల్లూరి: రెట్టింపైన మిరియాలు ధర

image

అల్లూరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విరివిగా పండిస్తున్న మిరియాల రేటు గణనీయంగా పెరిగింది. గతేడాది కిలో రూ.350 పలుకగా నేడు రూ.600కి రైతుల వద్ద నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పెదబయలు, ముంచింగిపుట్టు తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. అధిక ధర లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 8, 2026

మిరపలో నల్ల తామర పురుగుల నివారణ ఎలా?

image

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 8, 2026

13 మంది ప్రాణాలు తీసిన ఏనుగు

image

ఝార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. 2 రోజుల్లోనే 13 మందిని చంపేయగా, మరో నలుగురు గాయపడ్డారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ‘5వ తేదీన కోల్హాన్‌లో ఏనుగు దాడిలో ఏడుగురు, 6న నోవాముండి, హటగమారియలో ఆరుగురు మృత్యువాతపడ్డారు’ అని చెప్పారు. ఆ గజరాజును అడవిలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అక్కడ గత DEC 16 నుంచి ఏనుగుల దాడిలో 22 మంది ప్రాణాలు వదిలారు.

News January 8, 2026

‘కాకినాడ’కు ఆ పేరు ఎలా వచ్చిందో.. మీకు తెలుసా..?

image

చారిత్రక నగరమైన కాకినాడ పేరు వెనుక అనేక ఆసక్తికర కథనాలు ఉన్నాయి. బ్రిటీష్, ఫ్రెంచ్ కాలంలో తొలుత ‘కోకెనడా’గా, కాలక్రమేణా ‘కోకనందవాడ’, ‘కాకివాడ’, ‘కోకనాడ’గా రకరకాలుగా పిలిచేవారు. విదేశీయులు, క్రైస్తవ మత ప్రచారకులు పెట్టిన పేర్లు ఎన్ని ఉన్నా, చివరికి వాడుక భాషలో స్థిరపడి ‘కాకినాడ’గా రూపాంతరం చెందింది. నేడు జిల్లా కేంద్రంగా విరాజిల్లుతున్న ఈనగరం పేరుపై ఇప్పటికీ ఆసక్తికర చర్చలు జరుగుతుంటాయి.