News April 11, 2025
అల్లూరి: రేపే ఇంటర్ ఫలితాలు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అల్లూరి జిల్లాలో ఫస్టియర్ 8,063 మంది, సెకండియర్ 6,657 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News February 11, 2026
ఆసిఫాబాద్లో 67.13% పోలింగ్

ఆసిఫాబాద్ జిల్లాలోని 2 మున్సిపాలిటీల్లో పోలింగ్ బుధవారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 67.13% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్లో 20 వార్డుల్లో 77.67%, కాగజ్ నగర్లో 64.32% పోలింగ్ జరిగింది.
News February 11, 2026
హనుమకొండ జిల్లాలో 1170 కొత్త టీబీ కేసులు గుర్తింపు

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లాలో ఇంటింటా సర్వేలో 1,82,359 మందికి పరీక్షలు నిర్వహించగా 1170 కొత్తగా టీబీ కేసులు గుర్తించి నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అప్పయ్య తెలిపారు. కొత్తగా గుర్తించిన టీబి వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 511 మంది వ్యాధిగ్రస్థులకు న్యూట్రిషన్ కిట్లు అందించినట్లు తెలిపారు.
News February 11, 2026
నిర్మల్: ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం

నిర్మల్ జిల్లాలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు అన్నిచోట్ల ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగక ఇటు ఎన్నికల అధికారులు.. అటు పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఇద్దరు అధికారులు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. మరో పక్క జిల్లా పోలీస్ యంత్రాంగం ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.


