News February 1, 2025

అల్లూరి: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి(UPDATE)

image

అల్లూరి జిల్లా ఎటపాక మండలం గోపాలపురం గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాపురం గ్రామానికి చెందిన ఇద్దరు తమ సమీప బంధువులు భద్రాచలంలోని ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం ఉండడంతో బంధువులను పరామర్శించడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘటన జరిగిందన్నారు.

Similar News

News November 27, 2025

బయటకు సుందరం.. లోపల దుర్గంధం

image

వేములవాడ పట్టణంలోని VIP రోడ్డు ప్రాంతం బయటకు అందంగా కనిపిస్తుండగా.. వెనుక వైపు దుర్గంధం వెదజల్లుతోంది. పోలీస్ స్టేషన్- పార్వతీపురం దారిలో ఉన్న వీఐపీ రోడ్డులో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇనుప రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ కనపడకుండా దీనిని ఫిక్స్ చేశారు. మురికి కాలువ మళ్లించే పనులు అటకెక్కడంతో చెత్త పేరుకుపోయి, మురికి నీరు నిలిచి ఈ ప్రాంతంలో కంపు కొడుతోంది.

News November 27, 2025

VKB: అనుమానస్పద వ్యక్తులపై నిఘా: SP

image

స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహ మెహ్రా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, మొదటి విడతలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆమె పేర్కొన్నారు. అనుమానస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సూచించారు.

News November 27, 2025

తిరుమల: కల్తీ నెయ్యి కేసులో మరో అరెస్ట్.!

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. గతంలో టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేశారు. తాజాగా అరెస్ట్ అయిన వ్యక్తికి తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయినవారి సంఖ్య 9కి చేరింది.