News February 1, 2025
అల్లూరి: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి(UPDATE)

అల్లూరి జిల్లా ఎటపాక మండలం గోపాలపురం గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాపురం గ్రామానికి చెందిన ఇద్దరు తమ సమీప బంధువులు భద్రాచలంలోని ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం ఉండడంతో బంధువులను పరామర్శించడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘటన జరిగిందన్నారు.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


