News April 24, 2024

అల్లూరి: లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

image

అల్లూరి జిల్లా పోలీసుల ఎదుట ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను డీఐజీ విశాల్ గున్ని వెల్లడించారు. సీపీఐ మావోయిస్టు యూజీ క్యాడర్‌కి చెందిన ఆరుగురు పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయారన్నారు. గతంలో వీరిపై రూ.19 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్ సిన్హా, తదితర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 17, 2025

విశాఖ డీఆర్వో Vs ఆర్డీవో

image

విశాఖ‌ DRO భవానీ శంకర్‌, RDO శ్రీలేఖ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. డీఆర్వోపై కలెక్టర్‌కు ఆర్డీవో ఇటీవల లేఖ రాయగా.. రెవెన్యూ సిబ్బంది క‌లెక్ట‌ర్‌ను శుక్ర‌వారం క‌లిసి విన‌తిప‌త్రం అందించిన‌ట్లు స‌మాచారం. పచారీ సరుకుల కోసం త‌హశీల్దార్ల‌కు ఇండెంట్లు పెడుతున్నారన్న RDOఆరోపణలపై ‘అవగాహన లేని అధికారి చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని’ DRO అన్నారు. కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

News October 17, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

ఆరిలోవ BRTS రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. విజయనగరం (D)కి చెందిన వినయ్ పురుషోత్తపురంలో ఉంటూ విశాఖలోని ఓ కాలేజీలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. వినయ్ తన మిత్రుడు ఉదయ్‌తో తిరిగొస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వినయ్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్‌ చికిత్స్ పొందుతున్నాడు.

News October 17, 2025

విశాఖలో యాక్సిడెంట్.. నవవధువు మృతి

image

విశాఖలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందింది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వైపుగా స్కూటీపై వెళ్తోన్న దంపతులను కూర్మన్నపాలెం జంక్షన్లో RTC బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పైడిరాజు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పెదగంట్యాడ (M) సీతానగరానికి చెందిన ఉమాదేవి, పైడిరాజుకి 4 నెలల క్రితమే పెళ్లి అయింది.