News June 26, 2024

అల్లూరి 9.. అనకాపల్లికి 20.. 22వ స్థానంలో విశాఖ

image

➤ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షకు అల్లూరి జిల్లాలో 1,015 మంది విద్యార్థులు హాజరవ్వగా 794 మంది పాసయ్యారు. 78.23 శాతంతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది.
➤ అనకాపల్లి జిల్లాలో 3,031 మందికి 1,648 మంది ఉత్తీర్ణత సాధించారు. 54.37 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 20వ స్థానంలో నిలిచింది.
➤ విశాఖ జిల్లాలో 3,671 మందికి 1,898 మంది పాసయ్యారు. 51.70శాతం ఉత్తీర్ణతతో జిల్లా 22వ స్థానంలో నిలిచింది.

Similar News

News February 10, 2025

వైసీపీ ముఖ్య నేతలతో గుడివాడ సమావేశం

image

విశాఖ వైసీపీ ఆఫీసులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో ఇటీవల నియమించిన అనుబంధ సంఘాల అధ్యక్షులతో పలు విషయాలపై చర్చించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు, రమణికుమారి ఉన్నారు.

News February 10, 2025

విశాఖ: ముగిసిన నామినేష‌న్ల గ‌డువు

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేష‌న్ల గ‌డువు నేటితో ముగిసిందని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 3 నుంచి 10వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ కొన‌సాగింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 10 నామినేష‌న్లు దాఖల‌య్యాయి. అయితే వీరి నామినేష‌న్ల ప‌రిశీల‌న ప్ర‌క్రియ‌ 11న, ఉప సంహ‌ర‌ణ 13న ఉంటుంది. ప‌రిశీల‌న‌, ఉప‌సంహ‌ర‌ణ‌ పూర్త‌యిన త‌ర్వాత బ‌రిలో ఎంత మంది నిలుస్తార‌న్న‌ది తేలనుంది.

News February 10, 2025

నిర్మలా సీతారామన్‌తో విశాఖ ఎంపీ భేటీ

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను విశాఖ ఎంపీ శ్రీభరత్ సోమవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ప్యాకేజీకి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ బడ్జెట్‌లో 12 లక్షల వరకు వచ్చే జీతాలకు ఆదాయపు పన్ను ఉపశమనం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను కుదించడంతో మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు. 

error: Content is protected !!