News February 6, 2025

అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారణ: అనకాపల్లి ఎస్పీ

image

ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రహదారి ప్రమాదాలను నియంత్రించవచ్చునని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. రహదారి భద్రత మాసోత్సవాలు జిల్లాలో ఈ నెల 16 వరకు జరుగుతాయన్నారు. పలుచోట్ల రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దన్నారు.

Similar News

News November 27, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. పోలీసులు READY

image

త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు నిర్వహించారు. సమావేశంలో కమిషనరేట్‌కు చెందిన అన్ని విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ల వారీగా గ్రామాల వివరాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.

News November 27, 2025

జగిత్యాల జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లు ఎన్నంటే..?

image

జగిత్యాల జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు, 3536 వార్డులు ఉండగా, ఇందుకోసం 3536 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ముఖ్యంగా 75 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించి, అందుకు తగిన భద్రత చర్యలు చేపట్టారు. ఇందులో 1వ విడతలో 122 పంచాయతీలకు 1172 పోలింగ్ కేంద్రాలు, 2వ విడతలో 144 పంచాయతీలకు1276 పోలింగ్ కేంద్రాలు, 3వ విడతలో 119 పంచాయతీలకు 1088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News November 27, 2025

తిరుమల: సుబ్రహ్మణ్యానికి 10 వరకు రిమాండ్..!

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టయిన టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం సుబ్రహ్మణ్యంకు నెల్లూరు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. గురువారం సాయంత్రం ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, డిసెంబర్ 10వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సుబ్రహ్మణ్యంను నెల్లూరు కోర్టు నుంచి జైలుకు తరలించారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.