News February 6, 2025

అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారణ: అనకాపల్లి ఎస్పీ

image

ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రహదారి ప్రమాదాలను నియంత్రించవచ్చునని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. రహదారి భద్రత మాసోత్సవాలు జిల్లాలో ఈ నెల 16 వరకు జరుగుతాయన్నారు. పలుచోట్ల రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దన్నారు.

Similar News

News November 22, 2025

NMMS-2025 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో

image

జిల్లాలో రేపు జరగనున్న NMMS-2025 స్కాలర్‌షిప్ పరీక్షకు 1474 మంది 8వ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారని జిల్లా విద్యాధికారి కె.రాము తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు విద్యార్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రాలకు చేరాలని సూచించారు. జగిత్యాలలో 3, కోరుట్లలో 2, మెట్‌పల్లిలో 1 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

News November 22, 2025

మంచిర్యాల: త్వరలో వాట్సాప్ నంబర్ ఏర్పాటు

image

సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని సీ అండ్ ఎంబీ బలరామ్ తెలిపారు. కంపెనీ వ్యాప్తంగా దాదాపు అన్ని ఏరియాల నుంచి 40 మంది కార్మికులు ఫోన్ చేసి వివిధ అంశాలపై మాట్లాడారన్నారు. కార్మికుల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి వీలుగా త్వరలో ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

News November 22, 2025

కోరుట్ల: మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య

image

కోరుట్ల పట్టణానికి చెందిన సాంబారు అభిరామ్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చిరంజీవి శనివారం తెలిపారు. గతంలో మృతుని తండ్రి శ్యాంసుందర్ గంగలో మునిగి మృతి చెందగా నాటి నుండి తన తండ్రిని తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడన్నారు. తండ్రి మృతితో అభిరామ్ మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.