News February 6, 2025

అవగాహనతో రోడ్డు ప్రమాదాల నివారణ: అనకాపల్లి ఎస్పీ

image

ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రహదారి ప్రమాదాలను నియంత్రించవచ్చునని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. రహదారి భద్రత మాసోత్సవాలు జిల్లాలో ఈ నెల 16 వరకు జరుగుతాయన్నారు. పలుచోట్ల రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దన్నారు.

Similar News

News October 18, 2025

జనగామ: ధాన్యం గ్రేడింగ్‌లో సందేహాలా?

image

ధాన్యం కొనుగోలు సమయంలో గ్రేడింగ్ నిర్ధారణలో సందేహాలుంటే సంబంధిత శాఖల అధికారులను సంప్రదించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. నిర్ధారించుకునేందుకు డీఏవో కార్యాలయం(8977745482), పౌర సరఫరాల శాఖ(9966361171), టెక్నికల్ అసిస్టెంట్ (9666222500) నంబర్లలో సంప్రదించి నిర్ధారించుకోవాలని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 18, 2025

‘డ్యూడ్’, ‘తెలుసు కదా’ చిత్రాల కలెక్షన్స్ ఇలా!

image

* ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ మూవీకి తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి రూ.10 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
* సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఇండియాలో రూ.2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
* వీటిలో ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి.

News October 18, 2025

బొబ్బిలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. విజయనగరం నుంచి రాయగడ వైపు వెళ్తున్న రైలు నుంచి జారీ పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.