News March 13, 2025
అవయవ దానానికి ముందుకు రావాలి: కలెక్టర్

బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను దానం చేసి ఆదర్శవంతంగా నిలవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు నిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్లో వాక్ థాన్ అన్ ఆర్గాన్ డొనేషన్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానంతో 8 మంది రోగులకు అవసరమైన అవయవాలు అమర్చవచ్చన్నారు. గత సంవత్సరం అవయవ దానం ద్వారా 210 మందికి అమర్చారని గుర్తు చేశారు.
Similar News
News December 23, 2025
విశాఖలో రూ.27 కోట్ల జీఎస్టీ మోసం

విశాఖపట్నం డీజీజీఐ డిప్యూటీ డైరెక్టర్ శ్వేతా సురేష్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో రూ.27.07 కోట్ల భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. ఎటువంటి వస్తు సరఫరా లేకుండా నకిలీ ఐటీసీని సృష్టించిన ఈ నెట్వర్క్ సూత్రధారి మల్లికార్జున మనోజ్ కుమార్ను అధికారులు అరెస్టు చేశారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యల్లో భాగంగా విశాఖ జోనల్ యూనిట్ ఈ ఏడాది చేసిన నాలుగో అరెస్టు ఇది అని అధికార వర్గాలు తెలిపాయి.
News December 23, 2025
విశాఖ: రెండో మ్యాచ్లోనూ పైచేయి సాధిస్తారా?

విశాఖపట్నం వేదికగా శ్రీలంక మహిళలతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. బౌలర్ల అద్భుత ప్రదర్శన, ఆపై బ్యాటర్ల నిలకడైన ఆటతీరుతో భారత్ 8 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఈ విజయం ద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇవాళ రెండో మ్యాచ్లో తలపడనుంది. ఈ మేరకు నిన్న నెట్స్లో టీం చెమటోడ్చారు.
News December 23, 2025
విశాఖ బీచ్ రోడ్లో పీసా రన్ ప్రారంభం

విశాఖలో మంగళవారం నుంచి పీసా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం విశాఖ బీచ్ రోడ్లో గల కాళీమాత టెంపుల్ వద్ద PESA రన్ ప్రారంభించారు. క్రీడాకారిణి జ్యోతి సురేఖ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. IAS అధికారులు ముక్తా శేఖర్, శశిభూషణ్ కుమార్, కృష్ణ తేజ, ముత్యాల రాజు ఉన్నారు.


