News January 26, 2025

అవార్డు అందుకున్న అల్లూరి జిల్లా కలెక్టర్

image

అల్లూరి జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేశ్ కుమార్ బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ అందుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ చేతుల మీదుగా శనివారం ఈ అవార్డు తీసుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలలో ఈ అవార్డును ప్రదానం చేశారు. గతేడాది ఓటర్ల జాబితా తయారీలో, సమ్మరీ రివిజన్‌లో విశేష కృషి చేసినందుకు కలెక్టర్‌కు ఈ అవార్డు వరించింది.

Similar News

News November 27, 2025

వరంగల్: నేడే మంచి రోజు.. భారీ నామినేషన్లకు అవకాశం!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1683 గ్రామ పంచాయతీల్లో ఈసారి సర్పంచ్‌గా నిలబడి గ్రామానికి సేవ చేయాలనే ఆశతో ఎన్నో ఏళ్లుగా పూజలు, వ్రతాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న స్థానిక నాయకుల్లో నామినేషన్ ఉత్సాహం ఉప్పొంగుతోంది. గురువారం శుభముహూర్తం చివరి రోజు కావడం, రేపటి నుంచి మూడాళ్లు ప్రారంభం అవుతున్నాయి. దీంతో, భారీ సంఖ్యలో నామినేషన్లు నేడే వేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

News November 27, 2025

విజయనగరం: ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తం మరొకరికి ఎక్కించారు!

image

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 25న సర్జరీ కోసం సూరమ్మ అనే పేరు కలిగిన ఇద్దరు రోగులు చేరారు. అయితే ఒకే పేరు కావడంతో వైద్య సిబ్బంది వారికి బ్లడ్ ఎక్కించే సమయంలో గందరగోళానికి గురయ్యారు. ఒకరి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని మరొకరికి ఎక్కించారు. O పాజిటివ్ మహిళకు B పాజిటివ్, B పాజిటివ్ మహిళకు O పాజిటివ్ ఎక్కించారు. వెంటనే తప్పును గుర్తించి వారికి చికిత్స అందించారు. దీనిపై సూపరింటెండెంట్ డా.పద్మజ విచారణ చేపట్టారు.

News November 27, 2025

పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉంది: సుప్రీంకోర్టు

image

నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వారిని తీసుకొచ్చే హక్కు కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. గుజరాత్‌కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ కేసు విచారణలో జడ్జీలు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 2022 జులైలో దుబాయ్ పారిపోయిన ఉద్వానీపై గుజరాత్ హైకోర్టు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.