News January 25, 2025
అవార్డు గ్రహీతకు కలెక్టర్ ప్రశంసలు

ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తూ జైవిక్ ఇండియా అవార్డు -2025 ను అందుకున్న ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుకుంటకు చెందిన ఒబిలిశెట్టి గోపాల కృష్ణమూర్తిని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం అభినందించారు. బెంగుళూరులో యోగ్యత కేంద్రం ప్రతినిధుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న గోపాల కృష్ణమూర్తి, కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆమె ప్రశంసలు పొందారు.
Similar News
News December 6, 2025
ఖమ్మం: గ్రామాల్లో ‘బుజ్జగింపుల’ రాజకీయం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. తమ గెలుపుపై ప్రభావం చూపే బలమైన పోటీదారులను బ్రతిమిలాడి, బుజ్జగించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఖర్చు ఇస్తామని ఆఫర్ చేస్తుంటే, మరికొందరు మొండిగా పోటీలో ఉంటామని చెబుతున్నారు.
News December 6, 2025
ఖమ్మం: పల్లెల్లో ఎన్నికలు.. HYDలో ఉన్న ఓటర్లే కీలకం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బతుకుదెరువు కోసం HYDకు వలస వెళ్లిన పల్లె ఓటర్లే సర్పంచ్ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే కీలక శక్తిగా మారారు. దీంతో అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్లోనే మకాం వేశారు. తమను గెలిపిస్తే అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీలు ఇస్తున్నారు. ఈ కీలక ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.
News December 6, 2025
దశలవారిగా జోగులాంబ ఆలయ అభివృద్ధి

ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సచివాలయంలో ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ సమీక్ష నిర్వహించి, ఆలయ అభివృద్ధికి రూ.347 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొదటి దశలో రూ.138.40 కోట్లు, రెండో దశలో రూ.117.60 కోట్లు, మూడో దశలో రూ.91 కోట్లు ఖర్చు చేస్తారు.


