News July 3, 2024

అవాస్తవాలను నమ్మవద్దు: TTD

image

శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేశారని, దిట్టం పెంచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై TTD స్పందించింది. ‘ఇది పూర్తిగా అవాస్తవం. ఇటువంటి వార్తలు నమ్మవద్దు. ఈవో శ్యామలారావు మొన్న అర్చకస్వాములు, ఆలయ అధికారులతో సమావేశమయ్యారు. స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాలపై చర్చించారు. కానీ ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకోలేదు’ అని TTD స్పష్టం చేసింది.

Similar News

News November 22, 2025

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు శనివారం ఇలా ఉన్నాయి. ములకలచెరువులో నాణ్యత గల టమాటా 10 కిలోలు రూ. 520, పుంగనూరులో రూ. 500, పలమనేరులో రూ.490, వీకోటలో రూ.520, కలికిరిలో రూ.510, మదనపల్లెలో రూ. 630 వరకు పలుకుతున్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరల పెరుగుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 22, 2025

చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

image

GDనెల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. RTC బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు వివరాలు మేరకు.. బైకుపై ముగ్గురు GDనెల్లూరు నుంచి ఎట్టేరికి వెళుతుండగా మోతరంగనపల్లి వద్ద బస్సు-బైకు ఢీకొన్నాయి. బైకుపై ఉన్న ఇద్దరు స్పాట్‌లో చనిపోయారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 22, 2025

చిత్తూరు: రూ.7కోట్ల దొంగతనం.. ఐదుగురు అరెస్ట్

image

బెంగళూరులో ATMకు తరలిస్తున్న రూ.7.19 కోట్లను దోపిడీ చేసిన కేసులో కర్ణాటక పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇదివరకే సస్పెండ్ అయిన పోలీస్ అన్నప్ప నాయక్, చోరీలో కీలకంగా వ్యవహరించిన జేవియర్, గోపి, నెల్సన్, నవీన్‌ను అరెస్టు చేసి సిద్దాపుర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిత్తూరు జిల్లా గుడిపాల వద్ద ఇన్నోవా కారును వదిలి వ్యాగనార్ కారులో పరారైన జేవియర్‌ను తమిళనాడులో అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకెళ్లారు.