News January 30, 2025
అవి పట్టా భూములే: MP మిథున్ రెడ్డి

పట్టా భూములను అటవీ భూములుగా దుష్ప్రచారం చేయడం తగదని MPపెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. CM చంద్రబాబు కక్ష సాధింపుతోనే అనుకూల పత్రికలలో తమపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. వాటిని నిరూపించలేక పోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని, ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. తమకూ మంచి రోజులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News December 1, 2025
విశాఖ సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతారా?

నేటి నుంచి పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖ నుంచి ముగ్గురు MPలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలో ప్రధాన సమస్యలైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అపోహలు తొగించేలా ప్రకటన, రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్, రాజమహేంద్రవరం-అనకాపల్లి నేషనల్ హైవేకి నిధులు, అనకాపల్లిలోని పలు స్టేషన్లలో రైళ్లకు హాల్ట్, గిరిజనుల హక్కుల పరిరక్షణపై గళం విప్పాలని ప్రజలు కోరుతున్నారు.
News December 1, 2025
ఖమ్మం: ఒకే ఊరు.. రెండు పంచాయతీలు

కూసుమంచి మండలం ఈశ్వరమాధారం పెద్ద గ్రామ పంచాయతీని గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కొత్త పంచాయతీలుగా (ఈశ్వరమాధారం, మంగలితండా, రాజుపేట బజారు) విడదీసింది. అయితే, ఈ విభజనలో ఊరి మధ్యలో ఉన్న సీసీ రోడ్డునే సరిహద్దుగా నిర్ణయించారు. దీని కారణంగా ఇళ్లు పక్కపక్కనే ఉన్నా, నివాసితులు రెండు వేర్వేరు గ్రామ పంచాయతీల పరిధిలోకి వస్తున్నారు. ఈ అస్తవ్యస్త విభజన వల్ల ప్రజలకు పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయి.
News December 1, 2025
శ్రీకాకుళం జిల్లాలో 8,485 HIV కేసులు.!

జిల్లాలో సుమారు 8,485 HIV కేసులు ఉన్నట్లు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి శ్రీకాంత్ తెలిపారు. అందులో 3,526 మంది పురుషులు, 4,606 మంది స్త్రీలు, 23 ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి, టెక్కలి జిల్లా ఆసుపత్రి, రాగోలులో ART కేంద్రాలతో పాటు ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, కోటబొమ్మాళి,నరసన్నపేట, రణస్థలం,పాతపట్నం,పొందూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ICTC కేంద్రాల ద్వారా మందులు అందిస్తున్నామన్నారు.


